భావనపాడు పోర్టు ప్రాంతంలో భూ రిజిస్ట్రేషన్లపై నిషేధం
Published Tuesday, 7 June 2016శ్రీకాకుళం, జూన్ 6: విద్యార్థుల చదువులు ఆగిపోతున్నాయి.. ఈడొచ్చిన పిల్లలకు పెళ్లిళ్లూ కావడం లేదు. ఎవరికైనా రోగమో రొచ్చో వస్తే.. వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. ఇదీ శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్టు నిర్మాణానికి భూసేకరణ చేయనున్న తీరప్రాంత గ్రామాల ప్రజల దుస్థితి. పోర్టు నిర్మాణానికి ఆ ప్రాంత ప్రజలతో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించి, భూసేకరణ ప్యాకేజీలు, ఉద్యోగ అవకాశాలపై భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ, ఈ పోర్టు నిర్మాణం వల్ల తమ బతుకులు బాగుపడతాయని స్థానికులు కలలు కన్నారు. అయితే, అధికాల నిర్లక్ష్యం ఫలితంగా వారి కలలు కరిగిపోతున్నాయి.