హరివంశం 152
Published Monday, 6 June 2016అక్కడున్న రాజులందరూ ఆయనకు ససంభ్రమంగా ప్రత్యుత్థానం చేశారు. అంజలి ఘటించారు ప్రతి ఒక్కరూ. అట్లా వీణాలాపనం ముగించి ‘కమలాక్షా! అమరులందరు నిన్ను కీర్తిస్తారు. వారిని నీవు కరుణిస్తావు. నీ కీర్తితో సమానమైన కీర్తి ఈరేడు లోకాలలో ఎవరికీ దుర్లభం. నీతో సములెవరూ లేరు’ అని స్తోత్రించాడు నారదుడు.
దానికి కృష్ణుడు ఆహ్లాదకరంగా నవ్వుతూ, ‘నిజమే నీవన్నది. నేను అత్యంత ప్రీతిపాత్రుణ్ణి, పూర్ణ మనోరథ సిద్ధుణ్ణీ, పరిపూర్ణుణ్ణీ అవుతాను ఎప్పుడంటే, అందుకు అనుగుణమైన దక్షిణ ఏ లోపమూ లేకుండా నాకు సమర్పించిన వారి యెడల!’ అన్నాడు.