మూకుమ్మడి అత్యాచారాలు నిజమే
Published Wednesday, 1 June 2016చండీగఢ్, మే 31: హర్యానాలో గత ఫిబ్రవరిలో ఉవ్వెత్తున జరిగిన జాట్ల ఆందోళనలో జరిగిన అరాచకాలపై నిగ్గు తేల్చేందుకు ఏర్పడిన ప్రకాష్సింగ్ కమిటీ నివ్వెరపోయే నిజాలను బయటపెట్టింది. హైకోర్టు సమర్పించిన ఈ నివేదికలో మూకుమ్మడి అత్యాచారాలు నిజమేనని కమిటీ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి కార్లలోంచి మహిళలను బయటకు లాగి వివస్తల్రను చేసిన ఆందోళనకారులు మూకుమ్మడి అత్యాచారాలకు పాల్పడ్డారని పేర్కొంది. వాహనాల్లో ప్రయాణిస్తున్న మహిళలను బలవంతంగా బయటకు లాగి సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో అత్యాచారాలు జరిపారని నివేదించింది.