మానస సరోవర్లో యాత్రికులు సురక్షితం
Published Tuesday, 31 May 2016మహబూబ్నగర్, మే 30: మానస సరోవర్ యాత్రకు వెళ్లి వాతావరణం అనుకూలించకపోవడంతో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నేపాల్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. సోమవారం ఐదు హెలికాప్టర్లను నేపాల్ టూరిజం వారు సమకూర్చడంతో నేపాల్ ప్రభుత్వం సహయక చర్యలు చేపట్టినట్లు సమాచారం. గంటసేపు వాతావరణం అనుకూలించడంతో ముందుగా ఐదు హెలిక్యాప్టర్ల ద్వారా మహిళలను చైనా, నేపాల్ సరిహద్దులోని హిల్సా నుండి సిమికోట్ ప్రాంతానికి తరలించారు. వారిలో 20 మంది తెలుగు మహిళలే ఉన్నారు. అందులో ఆరుగురు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన శారద, అనితారెడ్డి, చేతన, శైలజతోపాటు మరో ఇద్దరున్నారు.