వేర్వేరు ప్రాంతాల్లో గంజాయి పట్టివేత
Published Tuesday, 31 May 2016జి.మాడుగుల, మే 30: మన్యం నుండి మైదాన ప్రాంతానికి తరలించడానికి సిద్ధంగా వున్న ఎండు గంజాయిని ముందస్తు సమాచారంతో స్ధానిక పోలీసులు సోమవారం పట్టుకున్నారు. జి.మాడుగుల ఎస్.ఐ. డి.శేఖరం విలేఖరులకు అందించిన వివరాలు ప్రకారం మండలంలోని సొలభం పంచాయితీ వట్టివెగిసె గ్రామంలో సుమారు 950 కిలోలు 270 ప్యాకెట్లుగా చేసి మైదాన ప్రాంతానికి తరలించడానికి సిద్ధపడుతుండగా అందిన సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నామని తెలిపారు. గంజాయి తరలించడానికి ప్రయత్నిస్తున్న వారిలో ముగ్గురు పరారీ కాగా ఒకరు పట్టుబడ్డారని ఆయన అన్నారు. గంజాయితో పట్టుబడిన సంపతి క్రిష్ణబాబుపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించామని తెలిపారు.