S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/29/2017 - 01:40

గుంటూరు, మార్చి 28: హిందూపూర్ నారాయణ విద్యాసంస్థల్లో టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం ప్రత్యక్షంగా బయటపడినా, ఆ విద్యాసంస్థల యాజమాన్యాన్ని రక్షించే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోందని ప్రతిపక్ష నేత జగన్ దుయ్యబట్టారు. అడ్డగోలుగా ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టటం వెనుక చంద్రబాబు బినామీల బాగోతం ఉన్నట్టు అర్థమవుతోందని జగన్ ధ్వజమెత్తారు.

03/29/2017 - 01:39

విశాఖపట్నం, మార్చి 28: కిశోర బాలికలు నెలసరి రుతుక్రమ సమయంలో వినియోగించే లక్షలాది శానిటరీ నేప్‌కిన్లు అధికారులను ఇరకాటంలో పడేస్తున్నాయి. అమ్మమంటే అడవి.. కొనమంటే కొరివి అన్న చందంగా మార్గదర్శకాలు ఉన్నాయని అధికార్లు గగ్గోలు పెడుతున్నారు. దాదాపు ఏడాదిగా ఈ ‘శానిటరీ’ స్టోరీ అధికారులను ఇబ్బందులకు గురి చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

03/29/2017 - 01:04

గుండాల, మార్చి 28: తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రేగులగూడెంలో పోడు భూములను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుంటారన్న ఆగ్రహంతో గ్రామానికి చెందిన ఆదివాసీలు మంగళవారం అటవీ శాఖ అధికారులపై దాడి చేసి వారి వాహనాలు, జెసిబిని దగ్ధం చేశారు. సోమవారం అటవీ శాఖ అధికారులు రేగులగూడెం గ్రామానికి వెళ్లి పిట్టతోగు ప్రాంతంలో జెసిబితో కందకాలు తవ్వుతామని ప్రజలకు తెలిపారు.

03/29/2017 - 01:01

హైదరాబాద్, మార్చి 28:్భద్రాచలం- సత్తుపల్లి రైల్వే లైన్‌కు రైల్వే బోర్డు మంగళవారం అనుమతించింది. ఈ మేరకే కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి దక్షిణ మధ్య రైల్వేకి సమాచారం పంపించారు. సింగరేణి కాలరీస్ సౌజన్యంతో భద్రాచలం రోడ్- సత్తుపల్లి మీదుగా కొవ్వూరు వరకు 133.70 కిలో మీటర్ల రైల్వే లైన్ ప్రతిపాదన. భద్రాచలం రోడ్- సత్తుపల్లి సెక్షన్ 53.20 కిలో మీటర్ల నిడివి.

03/28/2017 - 04:40

ఉగాది పండుగ సందర్భంగా
పాఠకులు, ప్రకటనకర్తలకు శుభాకాంక్షలు.
-ఎడిటర్

03/28/2017 - 03:50

తిరుపతి, మార్చి 27: వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు దర్శన సమయాన్ని ఎక్కువగా కేటాయించడంలో భాగంగా వారాంతంలో ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే విఐపి బ్రేక్ దర్శన సౌకర్యం కల్పించాలని నిర్ణయించినట్లు టిటిడి ఇఓ సాంబశివరావు వెల్లడించారు.

03/28/2017 - 03:12

హైదరాబాద్, మార్చి 27: హేమలంబ సంవత్సరం ఇటు తెలంగాణకు, అటు ఆంధ్రప్రదేశ్‌కు శుభసూచకంగా ఉంటుందని విశ్వయోగి విశ్వంజీ పేర్కొన్నారు. సోమవారం ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, కొత్త సంవత్సరంలో తెలుగు ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, ప్రజలందరికీ ఆశీస్సులు అందిస్తున్నానని తెలిపారు. ఈ సంవత్సరం కుజుడు రాజుగా ఉంటాడని, మంత్రిగా గురుడు ఉంటాడని, సస్యాధిపతిగా రవి ఉంటారన్నారు.

03/28/2017 - 02:45

హైదరాబాద్, మార్చి 27: అగ్రిగోల్డ్, అక్షయ్ గోల్డ్ కంపెనీలకు చెందిన ఆస్తుల వివరాలను వెబ్‌పోర్టల్‌లో ఉంచి ఇవేలం ద్వారా విక్రయించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఉమ్మడి హైకోర్టు సిఐడి, పిటీషనర్లను ప్రతిపాదించింది.

03/28/2017 - 02:34

హైదరాబాద్, మార్చి 27: కేసుల విచారణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఎపి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఉమ్మడి హైకోర్టు హెచ్చరిక జారీ చేసింది. వ్యక్తిగత కేసుల విషయంలోనూ, వారి విన్నపాలు విషయంలోనూ, మధ్యంతర ఉత్తర్వుల్లో సమతుల్యతను పాటించాలని కూడా హైకోర్టు పేర్కొంది.

03/28/2017 - 02:32

హైదరాబాద్, మార్చి 27: ప్రతి ఏడాది ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ ఈ ఏడాది హైదరాబాద్‌లో ఈనెల 28, 29న జరగనున్నాయి. ప్రతి ఏడాది ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో దక్షిణాదికి చెందిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషలకు ఈ అవార్డులను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో జరిగింది.

Pages