S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/27/2017 - 01:44

గుంటూరు (కల్చరల్), మార్చి 26: తెలుగునాట, మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాలో మారుమూల గ్రామంలో జన్మించి అద్భుతమైన నటనాభినయాన్ని సొంతం చేసుకుని, దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమకు, అంతకుమించి వెండితెరకు వెనె్నల వెలుగులద్దిన మహానటి సావిత్రి నటరాణి అని శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు నివాళి అర్పించారు.

03/27/2017 - 01:27

విజయవాడ, మార్చి 26: నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా శాసన సభ సమావేశాలు జరగడం ప్రజా ప్రతినిధుల్లో, స్థానికుల్లో ఆనందం మాట ఎలా ఉన్నా భద్రతా సిబ్బందికి పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. బందోబస్తుకోసం 13 జిల్లాల నుంచి వచ్చిన దాదాపు 3వేల మంది పోలీసుల్లో అత్యధికులు సకాలంలో తిండి, కొద్దిసేపైనా నిద్ర, కనీసం స్నానం చేసే సదుపాయం లేక అల్లాడిపోతున్నారు.

03/27/2017 - 01:23

భద్రాచలం, మార్చి 26: శ్రీరామనవమి రోజు వివిఐపీలు, విఐపీల పర్యటన, కల్యాణ మండపంలోకి వారు వచ్చే సమయ సమాచారాన్ని ముందుగానే తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఆదివారం ఆయన చిత్రకూట మండపంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

03/27/2017 - 01:08

హైదరాబాద్, మార్చి 26: గాంధీ దవాఖానలో చిన్నారులకు గడువు ముగిసిన ఇంజెక్షన్లు ఇచ్చారన్న ఆరోపణలపై వైద్య మంత్రి ఆదేశాల మేరకు విచారణ జరిపిన డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ (డిఎంఇ) డాక్టర్ రమణి ఒక పిజి వైద్యుడికి మెమో ఇస్తూ, ఇద్దరు స్ట్ఫా నర్సులను సస్పెండ్ చేసింది. వైద్యమంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు రమణి ఉన్నతస్థాయి విచారణ నిర్వహించారు. గాంధీ దవాఖానకు వెళ్లి పరిస్థితి సమీక్షించారు.

03/27/2017 - 01:05

హైదరాబాద్, మార్చి 26:తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యమంత్రి తనయుడు, రాష్ట్ర మంత్రి కెటిఆర్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించనున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకోవడంతోపాటు తన వారసుడిగా తనయుణ్ని నిలబెట్టే చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

03/27/2017 - 00:59

హైదరాబాద్, మార్చి 26: తెలుగు రాష్ట్రాల విభజన సందర్భంగా జరగాల్సిన పంపకాలపై రాజ్‌భవన్‌లో ఆదివారం సమావేశమైన ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీ ఈ దఫా కూడా ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతూండటంతో విభజన సమస్యలపై దృష్టి సారించలేకపోయినట్టు మంత్రులు గవర్నర్ నరసింహన్‌కు వివరించారు.

03/27/2017 - 00:58

విజయవాడ, మార్చి 26: విజయవాడ రవాణా శాఖ కార్యాలయం వద్ద శనివారం జరిగిన దౌర్జన్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఆ ఘటనతో ప్రమేయం ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణా శాఖాధికారులతో ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని), ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వ్యవహరించిన తీరుపై ఆయన సమాచారం తెప్పించుకున్నారు.

03/26/2017 - 08:24

గద్వాల, మార్చి 25: నడిగడ్డ సంస్కృతి, సంప్రదాయాలను ఎలుగెత్తి చాటేలా నిర్వహిస్తున్న గద్వాల సంబురాలు శనివారం సాయంత్రం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. గత పది రోజులుగా జిల్లా యంత్రాంగం అహర్నిశలు కృషి చేసి సంబురాల వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. సాయంత్రం 5 గంటల సమయంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన కళాకారులు రాజీవ్ చౌరస్తాకు చేరుకొని తమ నృత్యాలు, ఆటపాటలు, డప్పుల మోతలతో సంబరాన్ని అంబరాన్నంటేలా చేశారు.

03/26/2017 - 07:10

హైదరాబాద్, మార్చి 25: హైదరాబాద్ మహా నగర మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిధిలోని బ్రాహ్మణ నిరుద్యోగ యువతీయువకుల కోసం ‘జాబ్‌మేళా- 2017’ ను ఆదివారం ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నేతృత్వంలో మొట్టమొదటి కార్యక్రమంగా నిర్వహిస్తున్న ఈ జాబ్‌మేళా ‘పైలట్‌ప్రాజెక్టు’గా చేపడుతున్నామని పరిషత్ చైర్మన్ కెవి రమణాచారి తెలిపారు. శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

03/25/2017 - 04:42

గుంటూరు (కల్చరల్), మార్చి 24: ‘ఆరామ్ హరామ్ హై, పహలే కామ్ బాద్ మే ఆరామ్, కరో పహలే కహో పీచే’ అన్న జాతిపిత మహాత్మాగాంధీ మాటలను తన జీవితానికి ఆలంబనంగా చేసుకుని తనకోసం కాకుండా చుట్టూ ఉన్న సమాజం కోసం ఎంతో కొంత మేలు చేయాలనే తపన, ఆరాటంతో క్రేన్ సంస్థను స్థాపించి, వక్క పలుకులతో గుంటూరు కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా మార్మోగింపజేసిన క్రేన్ సంస్థల అధినేత గ్రంధి సుబ్బారావు(86) అస్తమించారు.

Pages