S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/26/2015 - 04:35

హైదరాబాద్, డిసెంబర్ 25: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును, ప్రభుత్వ భూముల లీజు గడువును 33 సంవత్సరాల నుంచి 99 సంవత్సరాలకు పెంచుతూ ఆమోదించిన బిల్లును తిరస్కరించాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎపిపిసిసి) అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కోరారు. ఈ మేరకు రఘువీరా రెడ్డి శుక్రవారం గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాశారు.

12/26/2015 - 04:33

తిరుపతి, డిసెంబర్ 25: తిరుపతి నుంచి షిర్డీకి రైలు కావాలనుకున్న సాయి భక్తుల కల నెరువేరుతోంది. ప్రతి మంగళవారం తిరుపతి నుంచి షిర్డీకి, ప్రతి బుధవారం షిర్డీ నుంచి తిరుపతికి నడిచే రైలును రైల్వే శాఖ మంత్రి ప్రభు ప్రారంభించనున్నట్టు రైల్వే శాఖ రీజనల్ ఆఫీసర్ సత్యనారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 26వ తేదీ సాయంత్రం 07417 నెంబరు గల రైలు సాయంత్రం 4.30 నిమిషాలకు తిరుపతిలో ప్రారంభిస్తారు.

12/26/2015 - 04:33

హైదరాబాద్, డిసెంబర్ 25: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్దమా అని టిటిడిపి రైతు విభాగం అధ్యక్షుడు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి మంత్రి కె.తారకరామారావు (కెటిఆర్)కు సవాల్ విసిరారు. విదేశాల్లో కెటిఆర్ పర్యటించి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు తప్ప తెలుగుదేశం హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందనే విషయాన్ని ఎందుకు వెల్లడించడం లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

12/26/2015 - 04:32

హైదరాబాద్, డిసెంబర్ 25: తమ పార్టీ జాతీయ నాయకుడు, మాజీ ప్రధాని ఎబి వాజ్‌పేయి స్పూర్తితో పెన్షన్లు, గృహ నిర్మాణం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నదని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శుక్రవారం వాజ్‌పేయి జన్మదినాన్ని పురస్కరించుకుని బిజెపి రాష్ట్ర శాఖ పేదలకు దుస్తులు, వికలాంగులకు త్రిచక్ర వాహనాలను పంపిణీ చేసింది.

12/26/2015 - 04:30

హైదరాబాద్, డిసెంబర్ 25: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరిఫ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశానికి వెళ్ళడం వల్ల ఇరు దేశాల మధ్య మరింత సత్సంబంధాలు నెలకొనడానికి ఉపయోగపడుతుందని, ఇది కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లేనని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

12/26/2015 - 04:02

భీమవరం/ ఆకివీడు, డిసెంబర్ 25: లోకా స్సమస్తా సుఖినోభవంతు అనే సిద్ధాంతాన్ని వేదాలు ప్రవచించాయని, విశ్వమానవ సౌభ్రాతృత్వానికి వేదాలు ప్రతీకలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని ఆకివీడు మండలం ఐ భీమవరం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్ధానం రూ 4.75 కోట్లతో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాలను శుక్రవారం రాష్టప్రతి ప్రారంభించారు.

12/26/2015 - 04:03

అరకులోయ, డిసెంబర్ 25: గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, అందాల అరకులోయ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేందుకే అరకు ఉత్సవ్ నిర్వహిస్తున్నట్టు మానవవనరుల అభివృద్ధి, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖ జిల్లా అరకులోయలోని గిరిజన సంస్కృతి మ్యూజియం ప్రాంగణంలో మూడు రోజులపాటు నిర్వహించే అరకు ఉత్సవ్‌ను మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి, తుడుముకొట్టి శుక్రవారం ప్రారంభించారు.

12/26/2015 - 03:42

హైదరాబాద్, డిసెంబర్ 25: అమరావతి రాజధాని నిర్మాణ సమగ్ర ప్రణాళిక నోటిఫికేషన్ ఆదివారం లేదా వచ్చే మంగళవారం విడుదలకానుంది. నోటిఫికేషన్ ఆధారంగా ప్రజల నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలను ప్రభుత్వం స్వీకరించనుంది. అనంతరం సమగ్ర ప్రణాళికను ప్రభుత్వం ఎండార్స్ చేయనుంది. ప్రక్రియ ముగిసిన తర్వాతనే భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయింపు జరుగుతుంది.

12/25/2015 - 21:30

జూలూరుపాడు: ఖమ్మం జిల్లా జూలూరుపాడు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మరణించారు. సైకిల్‌పై వెళుతున్న వీరిని లారీ ఢీకొన్న ఘటనలో వీరిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

12/25/2015 - 21:29

భద్రాచలం: చత్తీస్‌గఢ్‌లో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.

Pages