-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, అక్టోబర్ 28: దేశంలో ఉన్న అన్ని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో కన్నా అత్యధికంగా బోధన సిబ్బంది ఉన్న సంస్థగా వరంగల్ నిట్ రికార్డు నమోదు చేసిందని డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు చెప్పారు.
హైదరాబాద్, అక్టోబర్ 28: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం పంతాలకు పోకుండా ఇప్పటికైనా చొరవ తీసుకుని సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా పలు ప్రజాసంఘాలు , విద్యార్థి సంఘాల నేతలు , యువజన సంఘాలు కోరాయి.
హైదరాబాద్, అక్టోబర్ 28: విత్తన రంగం అభివృద్ధి, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమాభివృద్ధి, పంటల సాగు విధానాలు, వ్యవసాయ రంగంలో సహకార సంఘాల పాత్ర తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి బృందం విదేశీపర్యటనకు వెళుతోంది. ఈ నెల 29 న ప్రారంభమయ్యే ఈ బృందం పర్యటన నవంబర్ 6 వరకు అంటే ఎనిమిది రోజుల పాటు కొనసాగుతుంది.
శ్రీశైలంప్రాజెక్టు, అక్టోబర్ 28: జూరాల, సుంకేసుల డ్యాం నుంచి వస్తున్న వరదనీరు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం డ్యాంలో సోమవారం ఉదయం నుంచి రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.
నిజామాబాద్, అక్టోబర్ 28: నిజామాబాద్ జిల్లాకు ఆనుకుని గోదావరి నదిపై మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్ల మూసివేతకు వరద ప్రవాహం అడ్డంకిగా మారింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ గత జూలై 1న బాబ్లీకి చెందిన 14 గేట్లను పైకి ఎత్తారు.
సూర్యాపేట, అక్టోబర్ 28: కాశేశ్వరం లాంటి బహుళర్ధక ప్రాజెక్టును ఐదేళ్లలోనే పూర్తిచేసి తెలంగాణ అంతటినీ సస్యశ్యామలం చేస్తూ సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కొనియాడారు.
నల్లగొండ, అక్టోబర్ 28: తెలంగాణ సకల జనుల సమ్మె స్ఫూర్తితో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు ఈనెల 30న నిర్వహించే సకల జనుల భేరికి తరలిరావాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. సోమవారం నల్లగొండ ఆర్టీసీ డిపోలో నిర్వహించిన ఆర్టీసీ జేఏసీ 24వ రోజు సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపి ప్రసంగించారు.
కరీంనగర్, అక్టోబర్ 28: ఆర్టీసీలో అద్దె బస్సుల చొప్పించేందుకు సీఎం కేసీఆర్ కాంట్రాక్టర్లతో కుదుర్చుకున్న చీకటిఒప్పందం బహిర్గతం చేసేలా చర్యలు చేపట్టి రాష్ట్ర గవర్నర్ 50 వేల ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు.
హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల ప్రజలు గత 24 రోజుల నుండి నానా ఇక్కట్లు పడుతున్నారు. ప్రభుత్వం-ఆర్టీసీ కార్మికుల మధ్య ప్రయాణాలు సజావుగా జరగకపోవడంతో ప్రజలు నలిగిపోతున్నారు. దసరా, దీపావళి పండగలు కూడా ప్రజలు తమ సొంత గ్రామాలకు, సొంత ప్రాంతాలకు వెళ్లలేకపోవడంతో ఆనందంగా చేసుకోలేకపోయారు. ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రజల ఇక్కట్లు చెప్పనలవికానివిగా మారాయి.
హైదరాబాద్, అక్టోబర్ 28: రాష్ట్రంలో ‘నీరా’ విక్రయాలకు అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు, మార్గదర్శకాలను మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారా వు, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సోమవారం విడుదల చేశా రు.