S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/03/2016 - 00:54

న్యూఢిల్లీ, ఆగస్టు 2: దేశీయ ఆటోరంగ సంస్థ బజాజ్ ఆటో మోటార్‌సైకిల్ అమ్మకాలు గత నెల జూలైలో నిరుడుతో పోల్చితే స్వల్పంగా 1 శాతం పెరిగి 2,85,527 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రిందటిసారి 2,82,433 యూనిట్లుగా ఉన్నాయి. అయితే వాణిజ్య వాహనాల విక్రయాలు 7.3 శాతం తగ్గుముఖం పట్టాయి. ఈసారి 44,306 యూనిట్లుగా, పోయినసారి 47,798 యూనిట్లుగా ఉన్నాయి. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనలో బజాజ్ ఆటో తెలియజేసింది.

08/03/2016 - 00:53

న్యూఢిల్లీ, ఆగస్టు 2: దాదాపు 58 లక్షల పెన్షనర్ల బ్యాంకు ఖాతాలు.. ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన (పిఎమ్‌జెడివై) క్రిందకు రానున్నాయి. 2017 మార్చి 31 నాటికి అన్ని రాయితీలు, సంక్షేమ పథకాలు డైరెక్ట్ బెన్ఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) పరిధిలోకి రావాలన్న ప్రభుత్వ ప్రణాళికలో భాగంగానే పెన్షనర్ల బ్యాంకు ఖాతాలూ పిఎమ్‌జెడివై క్రిందకు వచ్చేలా ఉన్నాయి.

08/03/2016 - 00:53

ముంబయి, ఆగస్టు 2: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతకుముందు వరుసగా రెండు రోజులూ సూచీలు పతనమైనది తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం రాజ్యసభకు వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రానుండటం, ఐరోపా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడం మదుపరులను లాభాల స్వీకరణ దిశగా నడిపించాయి.

08/03/2016 - 00:50

న్యూఢిల్లీ, ఆగస్టు 2: దేశీయ ఔషధరంగ దిగ్గజం లుపిన్‌కు చెందిన జపాన్ అనుబంధ సంస్థ క్యోవా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ.. జపాన్‌కు చెందిన షియనోజి అండ్ కో నుంచి 21 ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఓ ఒప్పందం కూడా కుదిరింది. సుమారు వెయ్యి కోట్ల రూపాయల (15.4 బిలియన్ యెన్లు)కు సదరు ఉత్పత్తులను కొనుగోలు చేయడం జరుగుతోంది.

08/03/2016 - 00:50

హైదరాబాద్, ఆగస్టు 2: పరిశ్రమల్లో ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించేందుకు వెబ్ ఆధారిత మోటార్ టూల్‌ను ఇండస్ నెట్ టెక్నాలజీస్ రూపొందించినట్లు ఆ సంస్థ సిఇఒ అభిషేక్ రుంగ్టా మంగళవారం తెలిపారు. అలాగే విద్యుత్ మోటార్ డ్రైవర్ సిస్టమ్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు వినియోగించే మోటార్ టూల్‌ను ఇ-క్యూబ్ ఎనర్జీ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

08/03/2016 - 00:48

హైదరాబాద్, ఆగస్టు 2: వాణిజ్యం, ఎగుమతులకు సంబంధించిన వివాదాలపై రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు ప్రారంభించినట్టు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా టియోటియా వెల్లడించారు. మంగళవారం ఆస్కిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పరిశ్రమల శాఖ సీనియర్ అధికారులతో రీటా చర్చించారు.

08/03/2016 - 00:44

విశాఖపట్నం, ఆగస్టు 2: ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని (2016-17)కి సంబంధించి 770 కోట్ల రూపాయల మేర టర్నోవర్‌ను లక్ష్యంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డిసిఐ) నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో మంగళవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో డిసిఐ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంపై కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్, డిసిఐ సిఎండి రాజీవ్ త్రిపాఠీ సంతకాలు చేశారు.

08/03/2016 - 00:44

విశాఖపట్నం, ఆగస్టు 2: విశాఖ జిల్లాలోని వివిధ ప్రమాదకర పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు అంతంత మాత్రంగా ఉన్నట్లు వెల్లడైంది. దాదా పు 17 పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని సేఫ్టీ ఆడిట్‌లో గుర్తించారు. విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతున్న తరుణంలో పారిశ్రామిక ప్రమాదాలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది.

08/03/2016 - 00:34

న్యూఢిల్లీ, ఆగస్టు 2: డోపింగ్ వ్యవహారంలో సోమవారం నాడా (జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ) నుంచి క్లీన్‌చిట్ పొందిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్ మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నాడు. పార్లమెంట్ హౌస్‌లోని ప్రధాని కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.

08/03/2016 - 00:31

న్యూఢిల్లీ, ఆగస్టు 2: ఒలింపిక్ క్రీడల్లో మన దేశానికి పతకాన్ని అందిస్తాడని ఆశించిన షాట్‌పుటర్ ఇందర్‌జీత్ సింగ్ వరుసగా రెండోసారి కూడా డోపింగ్ పరీక్షలో విఫలమయ్యాడు. దీంతో అతను రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ద్వారాలు మూసుకుపోయాయి.

Pages