S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కింగ్స్టన్ (జమైకా), ఆగస్టు 2: కరీబియన్లతో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్లో భాగంగా కింగ్స్టన్లోని సబీనా పార్క్లో జరుగుతున్న రెండో మ్యాచ్లో భారత మిడిలార్డర్ బ్యాట్స్మన్ అజింక్యా రహానే అజేయ అర్ధ శతకంతో సత్తా చాటుకున్నాడు.
ముంబయి, ఆగస్టు 2: భారత క్రికెట్ జట్టు మొట్టమొదటిసారి అమెరికాలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు ఆడనుంది. ఫ్లోరిడాలో ఆ జట్టు వెస్టిండీస్తో రెండు టి-20 మ్యాచ్ల సిరీస్ను ఆడబోతోంది. ఇంతకు ముందు వెస్టిండీస్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు జరిగిన ప్లోరిడాలోని ఫోర్ట్ లూడెర్డేల్లో ఉన్న సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్కు వేదికగా ఆగస్టు 27, 28 తేదీల్లో ఈ రెండు మ్యాచ్లు జరుగుతాయి.
రియో డీ జెనిరో, ఆగస్టు 2: ఒలింపిక్స్లో పాల్గొనేందుకు రియో డీ జెనిరో నగరానికి చేరుకున్న భారత హాకీ జట్టు మంగళవారం సన్నాహక మ్యాచ్లో 2-1 గోల్స్ తేడాతో స్పెయిన్ను మట్టికరిపించింది. అద్భుతమైన ఫీల్డ్ గోల్తో ఆకాష్దీప్, పెనాల్టీ కార్నర్ను గోల్గా మలచిన రూపీందర్ పాల్ సింగ్ భారత జట్టుకు ఈ విజయాన్ని అందించారు.
ముంబయి, ఆగస్టు 2: జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడం వల్ల ఎదురయ్యే సమస్యలను అర్థం చేసుకోవడంలో బోర్డుకు సహకరించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ నేతృత్వంలో నలుగురు సభ్యుల న్యాయ నిపుణుల కమిటీని బిసిసిఐ ఏర్పాటు చేసింది.
ఇండోర్, ఆగస్టు 2: లోధా కమిటీ సిఫార్సులపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ) ఒక నిర్ణయం తీసుంటుందని, దానికి అనుగుణంగా మాత్రమే తాము పని చేస్తామని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ చెప్పారు.
కరీంనగర్, ఆగస్టు 2: పేద ప్రజలు, రైతులకు సంబందించిన రెవెన్యూ సమస్యల్ని ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖలపై మంత్రి ఈటల రాజేందర్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
తిమ్మాపూర్, ఆగస్టు 2: పోచంపాడ్ ప్రాజెక్టు నుండి ఎల్ఎండి రిజర్వాయర్లోకి బుధవారం రెండు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
పెద్దపల్లి రూరల్, ఆగస్టు 2: రాష్ట్రంలో అధికార టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బిజెపి అని, రాబోవు ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం కాయమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 7న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా మోదీతో మనం, మహా సమ్మేళనం కార్యక్రమానికి కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి ‘మీ ఆకాంక్షల్ని తెలపండి, ఎర్రకోటపై నుండి చేసే స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావిస్తాను’ అని తెలియజేయడం ముదావహం. దేశ ప్రజల ఆశలు, ఆశయాలు, కలలు ప్రతిబింబించేలా ప్రధాని ప్రసంగించడం మామూలే అయనా ప్రసంగ పాఠం తయారీలో ప్రధానిది, లేదా కార్యదర్శి వర్గానిదే ఏకైక పాత్ర. ఇందులో ప్రజల నుండి ఆలోచనల్ని సేకరించొచ్చన్న వూహే సరికొత్తది.
కరీంనగర్, అగస్టు 2: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలో జిల్లాలకు నిర్ధేశించిన లక్ష్యం మేరకు ఈ నెల 15 లోగా మొత్తం మొక్కలు నాటడం పూర్తి చేయాలని అటవీశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం హరితహారం కార్యక్రమం అమలుపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఆదిలాబాద్ నుండి పాల్గొన్నారు.