S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, డిసెంబర్ 4: చిల్లర కష్టాలు తీరేదెప్పుడు..? ఖచ్చితంగా ఇప్పుట్లో మాత్రం కాదంటే..కాదు.! ఈ మాటలు ఏకంగా ప్రముఖ ఆర్ధిక రంగ నిపుణులు విశే్లషిస్తున్నారు. కేంద్రం, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.500, రూ.1000 కొత్త నోట్లను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించి దాదాపు రెండు వారాలు కావస్తోంది. అందుబాటులోకి వచ్చే మాటలా ఉంచితే ఉన్న నోట్లు కూడా చెల్లని పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే.
రాజేంద్రనగర్, డిసెంబర్ 4: దేశ సమగ్రాభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పాలనలో పాదర్శకతకు పెద్దపీట వేశారని తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మేధావుల సెల్ కన్వీనర్ రాచూరి రాజశేఖర్ అధ్యక్షతన నోట్ల రద్దు, దాని ప్రభావంపై మేధావుల సదస్సు అత్తాపూర్ జనప్రియ బాస్కెట్బాల్ గ్రౌండ్లో నిర్వహించారు.
దేవరకద్ర, డిసెంబర్ 4: మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండల పరిధిలోని గోప్లాపూర్ క్రాస్రోడ్డు దగ్గర ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలుకాగా అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుండి కర్ణాటకలోని సింధనూర్కు వెళ్తున్న కారును రాయిచూర్ నుండి హైదరాబాద్కు వెళ్తున్న లారీ ఢీకొట్టింది.
కాచిగూడ, డిసెంబర్ 4: ఘంటసాల 94వ జయంతి సందర్భంగా ఘంటసాల గీతా విభావరి రాగరాగిణి ఆర్ట్స్ అసోసియేషన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గానసభలోని కళాలలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీరామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఘంటసాల భౌతికంగా లేకపోయినా చిరస్థాయిగా ప్రేక్షక హృదయాల్లో నిలిచి ఉన్నాడని పేర్కొన్నారు.
మేడ్చల్, డిసెంబర్ 4: మేడ్చల్ పోలీసు అధికారుల తీరుపై ఓ బాధితుడు డిజిపికి, సైబరాబాద్ సిపికి, బాలానగర్ జోన్ డిసిపికి, మానవ హక్కుల సంఘం కమిషనర్కు ఫిర్యాదు చేశాడు. మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సద్ది సంజీవరెడ్డి కుమారుడు శ్రీకాంత్రెడ్డి ఈ మేరకు ఆయా పోలీసు ఉన్నతాధికారులకు తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.
ఘట్కేసర్, డిసెంబర్ 4: స్వామియే అయ్యప్ప, శరణం, శరణం అయ్యప్ప అంటు అయ్యప్ప మాలధారులు చేసిన శరణు ఘోష ఘట్కేసర్ మండలంలో మారుమోగింది. ఘట్కేసర్ పంచాయతీ అనుబంధ గ్రామం శివారెడ్డిగూడెం గ్రామంలోని శ్రీ దండ్లగడ్డ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఆవరణలో శ్రీ ధర్మశాస్త్ర సేవాసమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మండల పూజ ఆదివారం ఘనంగా జరిగింది.
శేరిలింగంపల్లి, డిసెంబర్ 4: జిహెచ్ఎంసి వార్డు కమిటీల నియామకం తీవ్ర దుమారాన్ని రేపింది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, కార్పొరేటర్ల మధ్య ఆధిపత్య పోరు తీవ్రరూపం దాల్చడంతో అధికార పార్టీలో గందరగోళం నెలకొంది.
ఆసియా కప్ మహిళల టి-20 క్రికెట్ చాంపియన్షిప్ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత జట్టు. భారత్ వరుసగా ఆరోసారి ఈ టైటిల్ సాధించి డబుల్ హ్యాట్రిక్ను నమోదు చేయడం విశేషం.
విప్లవ వీరుడు, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రోకు
ఆదివారం కన్నీటి వీడ్కోలు పలుకుతున్న జనం
చెన్నై, డిసెంబర్ 4: తమిళ సినీ హీరో రజనీకాంత్ శనివారం రాత్రి ఇక్కడ ఒక సినిమా చిత్రీకరణ సందర్భంగా కిందపడిపోయి స్వల్పంగా గాయపడ్డారు. తదుపరి రానున్న తన సినిమా ‘2.0’లో ఒక సన్నివేశాన్ని ఇక్కడి కెలబాక్కంలో చిత్రీకరిస్తుండగా 66 ఏళ్ల రజనీకాంత్ అనుకోకుండా కిందపడి పోవడంతో అతని మోకాలికి స్వల్ప గాయం అయింది.