S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/18/2016 - 07:53

విజయవాడ, అక్టోబర్ 17: విశాఖపట్టణంలో హెర్బల్ హబ్‌ను నెలకొల్పాలనే ఆసక్తి వుందని స్విట్జర్లాండ్‌కు చెందిన ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ సైమన్ హుంజాకర్ సోమవారం ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ప్రతిపాదించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి ఆనందం వ్యక్తం చేస్తూ డాక్టర్ సైమన్ హుంజాకర్‌ను జ్ఞాపికతో సత్కరించారు.

10/18/2016 - 06:55

రాజమహేంద్రవరం, అక్టోబర్ 17: భారతదేశంలో పోలవరం అంత పెద్ద ప్రాజెక్టు మరొకటి రాదని, రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టు సత్వర పూర్తికి అహరహం శ్రమిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2018 నాటికి గ్రావిటీ ద్వారా ఈ ప్రాజెక్టు నుండి నీరిస్తామన్నారు. పోలవరం వద్ద ప్రాజెక్టు హెడ్ వర్క్సు డ్యాం సైట్‌లో పనులను సోమవారం ముఖ్యమంత్రి పరిశీలించారు.

10/18/2016 - 06:50

అమరావతి, అక్టోబర్ 17:అభివృద్ధి, ఉపాధి, పెట్టుబడులకు సర్కారీ ప్రకటనలే గీటురాళ్లు! మరి అవే తప్పుల తడకలుగా ఉంటే..పరస్పరం పొంతన లేని గణాంకాలతో విస్మయం కలిగిస్తే పరిస్థితి ఏమిటి? ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిని చాటిచెప్పేందుకు జరుగుతున్న పోటాపోటీ ప్రకటనల్లో పొంతన కొరవడింది. ఫలితంగా వేలాది కోట్లే ‘గల్లంతు’అయ్యాయి. లక్షలాదిగా ఉపాధి లక్ష్యాల్లోనే తేడాలొచ్చేశాయి.

10/18/2016 - 06:47

హైదరాబాద్, అక్టోబర్ 17: రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయో పరిమితిని రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ గత కొనే్నళ్లుగా జరగకపోవడం, లక్షలాది అభ్యర్ధులకు వయోపరిమితి దాటిపోవడంతో వారంతా వయోపరిమితి పెంచాలని గత కొంతకాలంగా కోరుతున్నారు.

10/18/2016 - 06:44

సింథియా, అక్టోబర్ 17: విశాఖలోని సింథియా ప్రాంతంలో 9వతరగతి చదువుతున్న పద్నాలుగేళ్ల బాలికపై ఐదుగురు యువకులు 12 రోజులుగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 47వ వార్డు పరిధి నక్కవానిపాలెంలో నివాసం ఉంటున్న కోరాడ అచ్చిబాబు కుమార్తె ఈనెల 1న పాఠశాలకు వెళ్లి సాయం త్రం ఇంటికి వచ్చింది.

10/18/2016 - 06:42

రాజమహేంద్రవరం, అక్టోబర్ 17: ‘నాపై ప్రేమాభిమానాలు చూపి, నన్ను ఆదరించిన పశ్చిమ గోదావరి జిల్లాకు అన్యాయం జరగనిస్తానా... గోదావరి మెగా ఆక్వా పుడ్ పార్కువల్ల ఎటువంటి కాలుష్యం ఉండదు..నాదీ గ్యారం టీ’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

10/18/2016 - 06:40

కాకినాడ, అక్టోబర్ 17: సారవంతమైన వ్యవసాయ భూములను ఆక్వా చెరువులుగా మార్చడాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయ భూముల్లో అధికారికంగా, అనధికారికంగా చెరువులు తవ్వుతూ ఆక్వా సాగు చేస్తున్న రైతులపై కఠినంగా వ్యవహరించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఆక్వా జోన్ల నిర్ధారణకు రాష్ట్ర శాటిలైట్ అప్లికేషన్స్ సెంటర్ ఆధ్వర్యంలో శాటిలైట్ సర్వే నిర్వహించారు.

10/18/2016 - 06:29

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 17: పేదల శక్తి సామర్ధ్యాలను మేల్కొలపడం కోసం సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుందని ప్రముఖ సామాజిక ఉద్యమ నేత, భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ మనువడు డాక్టర్ ప్రకాష్ అంబేద్కర్ అన్నారు.

10/18/2016 - 06:24

హైదరాబాద్, అక్టోబర్ 17: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంలో తన పలుకుబడి ఉపయోగించి పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి చరిత్ర సృష్టించాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్రమం తప్పకుండా పోలవరం వెళ్లి పనులను పర్యవేక్షిస్తున్నారు. అయినా కాంట్రాక్టు పొందిన ట్రాన్స్‌ట్రాయ్ మాత్రం ఆ మేరకు పనులను వేగంగా పూర్తి చేయడంలో విఫలమవుతోంది.

10/18/2016 - 06:23

విశాఖపట్నం, అక్టోబర్ 17: మహా విశాఖ నగరానికి మరింత వనె్న తెచ్చే విధంగా వస్తుందనుకున్న మెట్రో రైల్ ప్రాజెక్టు ఒక్క అంగుళం ముందుకు కదల్లేదు. విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టును ప్రభుత్వ,ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) విధానంలో పూర్తి చేయాలని, అందుకు జపాన్ ఇంటర్నేషనల్ కోపరేటివ్ ఏజెన్సీ (జైకా) ఆర్థిక సాయం తీసుకోవాలని నిర్ణయించారు.

Pages