-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
యాక్సిస్ బ్యాంక్ షేర్లు శుక్రవారం సుమారు మూడు శాతం లాభాల్లో ట్రేడయ్యాయి. 2018-19 ఆర్థిక సంవత్సరం, చివరి త్రైమాసికంలో 1,505 కోట్ల రూపాయల నికర లాభాన్ని బ్యాంక్ ప్రకటించింది. సెబీకి ఫైలింగ్ సమర్పించిన నేపథ్యంలో, బీఎస్ఈలో యాక్సిస్ బ్యాంక్ షేర్ ధర 3.25 శాతం పెరిగి, 765 రూపాయలకు చేరింది. అదే విధంగా ఎన్ఎస్ఈలో 3.27 శాతం లాభాలను ఆర్జించి 765.15 రూపాయలుగా స్థిరపడింది.
ముంబయి, ఏప్రిల్ 26: బాంబే స్టాక్ మార్కెట్ (బీఎస్ఈ)లో లావాదేవీలకు చివరి రోజైన శుక్రవారం లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయ సూచీలు సానుకూల ధోరణులను ప్రదర్శించడంతోపాటు, ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర స్వల్పంగా తగ్గడం కూడా భారత స్టాక్ మార్కెట్కు లాభాలను ఆర్జించి పెట్టింది. ఒకానొద దశలో సెనె్సక్స్ 39,103.16 పాయింట్లకు చేరుకున్నప్పటికీ, ఆతర్వాత కొంత పతనమైంది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: చైనాకు చెందిన టెక్ దిగ్గజం గ్జియోమీ మనదేశంలో సుమారు 10వేల రీటైల్ స్టోర్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ సంవత్సరాంతానికల్లా ఆఫ్లైన్లో 50 శాతం వాణిజ్యాన్ని భారత్ నుంచి నిర్వహించాలన్న లక్ష్యం ఉందని ఆ కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. 2014లో గ్జియోమీ ఆన్లైన్లో మాత్రం లభించే బ్రాండ్ సెల్ ఫోన్గా భారత్లో తన వాణిజ్యాన్ని ఆరంభించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: వ్యవసాయోత్పత్తుల్లో పెరుపొందిన ర్యాలీస్ ఇండియా కంపెనీ షేర్లు భారత స్టాక్ మార్కెట్లో నష్టాల్లో ట్రేడయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో నికర లాభం 93 శాతం పడిపోయిందని ఈ కంపెనీ బీఎస్ఈకి సమర్పించిన ఫైలింగ్లో పేర్కొంది. దీనితో కంపెనీ షేర్లు సగటున 5 శాతం నష్టాలను చవిచూశాయి. బీఎస్ఈలో ఈ కంపెనీ షేర్ ధర 4.86 పడిపోయి, 149.55 రూపాయలకు చేరింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (జేఎస్పీఎల్) గత ఆర్థిక సంవత్సరంలో 7.07 మిలియన్ టన్నుల స్టీల్ పెలెట్లను ఉత్పత్తి చేసింది. ఒడిశాలోని బార్బిల్లో ఉన్న తొమ్మిది ఎంటీపీఏ పెలెటైజేషన్ కాంప్లెక్స్లో ఈ ఉత్పత్తి సాధ్యమైందని బీఎస్ఈకి దాఖలు చేసిన ఫైలింగ్లో జిందాల్ స్టీల్ పేర్కొంది. కంపెనీ చరిత్రలోనే ఒకనెలలో అత్యధిక ఉత్పత్తిని మార్చి మాసంలో నమోదు చేశామని తెలిపింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: బులియన్ మార్కెట్లో బంగారం మెరిసింది. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర 150 రూపాయలు పెరిగి, 33,020 రూపాయలకు చేరింది. అదే విధంగా కిలో వెండి ధర 230 రూపాయలు మెరుగుపడి, 38,750 రూపాయలుగా నమోదైంది. అంతర్జాతీయ బలియన్ మార్కెట్ సానుకూల ధోరణులను ప్రదర్శించిన నేపథ్యంలో దేశంలో నగల వ్యాపారులు బంగారం, వెండి కొనుగోలుపై ఆసక్తిని ప్రదర్శించారు.
ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,110.00
8 గ్రాములు: రూ.24,880.00
10 గ్రాములు: రూ. 31,100.00
100 గ్రాములు: రూ.3,11,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,210.00
8 గ్రాములు: రూ. 25,680.08
10 గ్రాములు: రూ. 32,100.00
100 గ్రాములు: రూ. 3,21,000.00
వెండి
8 గ్రాములు: రూ. 323.60
ముంబయి: అంతర్జాతీయంగా ప్రతికూల ధోరణులు బలమైన పాత్ర పోషించిన నేపథ్యంలో, గురువారం భారత స్టాక్ మార్కెట్ కుదేలైంది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ)లో సెనె్సక్స్ 324 పాయింట్లు పతనంకాగా, జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్ఎస్ఈ)లో నిఫ్టీ 11,650 పాయింట్లకు దిగువున ముగిసింది. ఆటో, మెటల్, ఎనర్జీ, ఫైనాన్షియల్ రంగాలకు సంబంధించిన కంపెనీల షేర్లకు డిమాంత్ తగ్గి, అమ్మకాల ఒత్తిడి పెరిగింది.
ముంబయి, ఏప్రిల్ 25: రైట్స్ ఇస్యూ ద్వారా దాదాపు రూ. 25వేల కోట్ల నిధుల సమీకరణ యత్నాల్లో ఉన్న వొడాఫోన్, ఐడియా సంయుక్త సంస్థ రానున్న 2021వ సంవత్సరానికి సైతం మరోమారు నిధుల సమీకరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈటెలికాం సంస్థకు ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ షేర్ నష్టపోకతప్పదని విదేశీ బ్రోకరేజ్ సంస్థ ‘జెఫరీస్’ అధ్యయన నివేదిక గురువారం నాడిక్కడ వెల్లడించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: డిష్టీవీ గురువారం ‘ఆన్లైన్ వీడియో ఆన్ డిమాండ్’ సెగ్మెంట్లోకి అడుగిడింది. ఓవర్ ది ఆప్ (ఓటీటీ) వేదిక ‘వాచో’ను ఆవిష్కరించింది. తద్వారా వచ్చే సంవత్సర కాలంలో సుమారు 10 మిలియన్ వినియోదారులు సమకూరుతారని ఆ సంస్థ అంచనా వేస్తోందని డిష్టీవీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, గ్రూప్ సీఈవో అనిల్ దుయా తెలిపారు.