S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/17/2017 - 02:22

విశాఖపట్నం, డిసెంబర్ 16: అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా విశాఖను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. పవన్ హాన్స్ సంస్థ సహకారంతో ఏపీ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ‘హెలీ టూరిజం’ను శనివారం విశాఖలో వుడాపార్కు వద్ద ఆయన ప్రారంభించారు.

12/17/2017 - 02:20

విశాఖపట్నం, డిసెంబర్ 16: రాష్ట్రానికి గ్లోబల్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ రానుంది. యునెస్కో ఎంజీఐఈపీ, శాంసంగ్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది.

12/17/2017 - 02:16

విశాఖపట్నం (జగదాంబ), డిసెంబర్ 16: టెక్నాలజీ వినియోగంలో ఏపీ నెంబర్ వన్‌గా నిలుస్తోందని, ఉత్తమ పరిపాలన, మెరుగైన ప్రజా సేవలకు టెక్నాలజీ ఎంతో అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం విశాఖలో కరూర్ వైశ్యా బ్యాంక్ 101వ వ్యవస్థాపక దినోత్సవంలోముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా అమలయ్యే పౌర సేవలన్నింటినీ టెక్నాలజీతోనే అనుసంధానం చేస్తామన్నారు.

12/16/2017 - 01:19

హైదరాబాద్, డిసెంబర్ 15: మహానగరంలో నిత్యం ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాలు ఆర్థికోత్పత్తి పరిశ్రమగా మారాలని అంతర్జాతీయ ఘన వ్యర్థాల సదస్సులో పాల్గొన్న పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సు శుక్రవారం మొదలైంది. 30 దేశాలకు చెందిన 600 మంది ప్రతినిధులు హాజరైన ఈ సదస్సులో జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.

12/16/2017 - 01:08

ముంబయి, డిసెంబర్ 15: గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ సర్వేలు బీజేపీకి అనుకూలంగా రావడం శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ వరుసగా రెండో రోజు పుంజుకుంది. ఈ సూచీ శుక్రవారం 216 పాయింట్లు పెరిగింది.

12/16/2017 - 01:06

వాషింగ్టన్, డిసెంబర్ 15: పెద్ద నోట్ల రద్దు కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు భవిష్యత్‌లో అంతే మేలేనని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. నగదు నిల్వల కొరత కారణంగా తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు తలెత్తడం కనిపించినా, ఏడాది తరువాత హితమైన మేలే కనిపిస్తోందని ప్రపంచ బ్యాంకు సమాచార విభాగం సహాయ అధికార ప్రతినిధి విలియం ముర్రే మీడియాకు వెల్లడించారు.

12/16/2017 - 01:06

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ టెలివిజన్లు, మొబైల్ ఫోన్లు, ప్రొజెక్టర్లు, వాటర్ హీటర్లు సహా కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచింది. దేశీయంగా వీటి తయారీకి ఊతమిచ్చే చర్యలో భాగంగా ప్రభుత్వం వీటిపై దిగుమతి సుంకాన్ని పెంచింది.

12/16/2017 - 01:05

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: పన్ను ఎగవేతలను నిరోధించే మార్గాలను అనే్వషించడంతో పాటు ఈ-వేబిల్‌ను త్వరగా అమలు చేసే అంశంపై చర్చించడానికి వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి శనివారం సమావేశం కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగుతుందని, ఈ కొత్త వ్యవస్థలో ఉన్న లోపాలను పూడ్చడంపై, పన్ను ఎగవేతలను అణచివేయడంపై చర్చిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.

12/16/2017 - 01:02

అమరావతి, డిసెంబర్ 15: నవ్యాంధ్ర ఐటీ రంగంలో మరో ఘన విజయం. ఇప్పటివరకూ అమెరికాకు మాత్రమే పరిమితమైన దిగ్గజ ఐటీ కంపెనీ గూగుల్ ఎక్స్ త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టనుంది. ఆ మేరకు ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో గూగుల్ ఎక్స్ కంపెనీతో ఒప్పందం కుదిరింది.

12/15/2017 - 01:39

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, దేశాభివృద్ధికి సమర్థవంతమైన, నాణ్యమైన విద్యుత్ అందుబాటులో ఉండటం అనేది ఎంతో కీలకమని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. భారత్ గత మూడేళ్లుగా అవసరమైన దానికన్నా ఎక్కువ విద్యుత్ (మిగులు విద్యుత్)ను ఉత్పత్తి చేయడంలో విజయవంతమైందని ఆయన పేర్కొన్నారు.

Pages