-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
ముంబయి, డిసెంబర్ 4: దేశీయ మార్కెట్ల నాలుగు రోజుల వరుస పతనానికి సోమవారం బ్రేక్ పడింది. మార్కెట్ల ప్రధాన సూచీలయిన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) నిఫ్టీలు సోమవారం నాటి సెషన్లో పడిపోకుండా నిలదొక్కుకున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పైకి, కిందికి కదలాడిన మార్కెట్ సూచీలు చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి.
ఉక్కునగరం, డిసెంబర్ 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే భారీ ప్రభుత్వరంగ సంస్థ విశాఖ స్టీల్ప్లాంట్లోని బ్లాస్ట్ ఫర్నేస్ విభాగంలో ఉత్పత్తిపై ముడి సరుకు ప్రభావం పడింది. ఇటీవల కాలంలో మొదలైన ముడి సరుకు ప్రభావం మరింత తీవ్రతరం అవుతుంది. ముడిసరుకు కొరత ప్రభావం కారణంగా బ్లాస్ట్ ఫర్నేస్-1ను సోమవారం షట్డౌన్ చేశారు. ఆదివారం బ్లాస్ట్ ఫర్నేస్-2 కూడా అధికారులు షట్డౌన్ చేశారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: క్యాన్సర్ వ్యాధి చికిత్సలో భాగంగా వినియోగించే హెర్సెప్టిన్ను పోలిన ఔషధం ఓగివ్రిని అమెరికా మార్కెట్లోకి విడుదల చేసేందుకు నియంత్రణ సంస్థ నుంచి తనకు అనుమతి లభించిందని ప్రకటించిన బయోకాన్ కంపెనీ షేర్లకు సోమవారం మార్కెట్లో మంచి ఆదరణ లభించింది. ఒక్క సెషన్లోనే ఈ కంపెనీ షేర్ల ధర 15 శాతం పెరిగింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4,020 కోట్లు పెరిగింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: మార్కెట్ నుంచి రూ. 5వేల కోట్ల మూలధనాన్ని సేకరించడానికి వాటాదారుల ఆమోదం పొందినట్లు ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) సోమవారం తెలిపింది. అర్హత గల సంస్థలకు వాటాలను అమ్మడం (క్యూఐపీ) ద్వారా కాని రైట్స్ ఇష్యూ ద్వారా కాని ఈ మూలధనాన్ని సేకరించడానికి వాటాదారులు ఆమోదం తెలిపినట్టు పీఎన్బీ వెల్లడించింది.
నల్లగొండ టౌన్, డిసెంబర్ 4: గిట్టుబాటు ధర లేకపోవడంతో నిమ్మ రైతులు కుదేలవుతున్నారు. బస్తా నిమ్మకాయలను కేవలం 100 రూపాలయకే దళారులు కొనుగోలు చేస్తుండడంతో రైతులు పెట్టుబడి కూడా రాక అప్పుల ఊబిలో కూరుకపోతున్నారు. వరుసగా రెండేళ్లుగా మద్దతు ధర లేక నిమ్మ రైతులు తమ దిగుబడులను రోడ్లపై పారవేసి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వాల్లో చలనం లేకపోవడం నిమ్మ రైతులను నిరాశ పరుస్తోంది.
నల్లగొండ, డిసెంబర్ 4: కృష్ణానదిలో ఈ ఏడాది సైతం సమృద్ధిగా వర్షాలు లేకపోవడంతో నాగార్జునసాగర్ గేట్లు దాటి కృష్ణమ్మ పులిచింతల ప్రాజెక్టు దరికి చేరకపోవడంతో ప్రాజెక్టులో నీటిమట్టం కనీస స్థాయికి దిగువకు పడిపోయిం ది. పూర్తి స్థాయి నీటి మట్టం 45,77 టీఎంసీలు కాగా కనీస నీటి మట్టం 4 టీఎంసీలు. ప్రస్తుతం జలాశయంలో 3.58 టీఎంసీల నీటి మట్టం మాత్రమే ఉంది.
ముంబయి, డిసెంబర్ 3: రిజర్వ్ బ్యాంక్ (ఆరీబీఐ) ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. వరుసగా అయిదు త్రైమాసికాలు దిగజారిపోయిన స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో తిరిగి పుంజుకోవడంతో ద్రవ్యోల్బణం నియంత్రణపైనే ఆర్బీఐ కేంద్రీకరిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 3: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 2.11 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్ పథకంలో భాగంగా ఎనిమిది ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్యూలు) నాలుగు నెలల్లోగా మార్కెట్ నుంచి మూలధనాన్ని సేకరించుకోవాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్, డిసెంబర్ 3: ప్రభుత్వ పరిపాలనలో మొబైల్ యాప్ల పాత్ర క్రమేణా కీలకం కాబోతోంది. రోజు రోజుకీ కొత్త కొత్త యాప్ల ఆవిష్కరణ జరుగుతోంది. దీంతో ప్రజల చెంతకు పాలన, సేవలు మరింత వేగంగా అందుతున్నాయి. సేవల విభాగంలో తలెత్తే అనేక సమస్యలకు పరిష్కారాలు లభిస్తుండడమే కాకుండా డిజిటల్ లావాదేవీలు వేగవంతంగా జరిగేందుకు అవకాశం కలిగింది.
భూపాలపల్లి రూరల్, డిసెంబర్ 3: వెలుగులు అందించే కాకతీయ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులో ఉద్యోగాల వస్తే తమ జీవితాల్లో వెలుగులు వస్తాయని దళారులను నమ్మిన నిరుద్యోగుల బతుకుల చీకటిమయంగా మారుతున్నాయి.