S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/08/2017 - 00:38

హైదరాబాద్, డిసెంబర్ 7: రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమలను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఐటీ పరిశ్రమలను నెలకొల్పడానికి 18 కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. ఈ కంపెనీల నుంచి సేకరించిన అంగీకార పత్రాలను ఐటీశాఖ మంత్రి కె తారకరామారావుకు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ గురువారం అందజేసారు.

12/08/2017 - 00:35

హైదరాబాద్, డిసెంబర్ 7: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, విశ్వనగరంగా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా గురువారం మెల్‌బోర్న్‌లో తెలంగాణ ప్రజలను కలుసుకున్నారు.

12/08/2017 - 00:29

హైదరాబాద్, డిసెంబర్ 7: దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ తొలిసారిగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్) ఖాతాను ఇన్‌స్టెంట్‌గా పూర్తిగా ఆన్‌లైన్‌లో పేపర్ రహిత విధానంలో తెరిచేందుకు డిజిటల్ సేవలను గురువారం ఆవిష్కరించింది. ఈ సదుపాయంతో పిపిఎఫ్ ఖాతాను ప్రారంభించేందుకు బ్యాంకు ఖాతాదారులు బ్యాంకును సందర్శించి, భౌతికంగా డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం లేదు.

12/08/2017 - 00:28

హైదరాబాద్, డిసెంబర్ 7: సిగరెట్ల వినియోగంపై గత ఆరేళ్ల నుంచి పెంచుకుంటూ వస్తున్న పన్నులు 202 శాతానికి చేరుకోవడంతో దాదాపు రూ.3,300 కోట్ల నష్టాన్ని పొగాకు రైతులు చవిచూశారని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఏఐఎఫ్‌ఏ) పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో పొగాకు పండించే రైతులు, ఆ రంగంపై ఆధారపడిన వేలాది కార్మికులకు జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది.

12/07/2017 - 01:05

ముంబయి, డిసెంబర్ 6: అందరూ అంచనా వేసినట్టుగానే జరిగింది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయంతో కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. అయితే ఇంటి, వాహన రుణాలపై వడ్డీ రేట్లను కాస్త తగ్గించుకునేందుకు బ్యాంకులకు కొంచెం అవకాశం కల్పించింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో ద్రవ్యోల్బణం అంచనాను కూడా 4.3-4.7 శాతానికి పెంచింది.

12/07/2017 - 01:04

విజయవాడ, డిసెంబర్ 6: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని, కావల్సిన వసతులు కల్పిస్తామని దక్షిణ కొరియాకు చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. కృష్టపట్నం పోర్టుతో బూసన్ పోర్టు అనుసంధానం, లాజిస్టిక్ వర్సిటీ ఏర్పాటు, కార్గో వ్యాపారానికి ఉన్న అవకాశాలను వివరించారు.

12/07/2017 - 01:01

ముంబయి, డిసెంబర్ 6: ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయంతో రిజర్వ్ బ్యాంక్ (ఆరీబీఐ) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించడం దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. కీలక వడ్డీ రేట్లు మారకపోవచ్చనే సంకేతాలు వెలువడంతో మంగళవారం పడిపోయిన మార్కెట్ ప్రధాన సూచీలు, బుధవారం ఆర్‌బీఐ నిర్ణయం వెలువడటంతో వరుసగా రెండో రోజూ పతనమయ్యాయి.

12/07/2017 - 01:00

హైదరాబాద్, డిసెంబర్ 6: ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నార్సింహారెడ్డి పర్యటిస్తున్నారు. విక్టోరియాలోని పారిశ్రామిక దిగ్గజాలు, ప్రవాస భారతీయులతో ఆయన బిజీగా ఉన్నారు. విక్టోరియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సీఈవో అర్జున్ సూరపనేని, హాన్ క్రేప్గ్ ఒందర్చియే, ఎంపి సాన్ అలాన్ గ్రిఫిన్, ప్రొఫెసర్ రిచర్డ్ కార్టర్‌లతో భేటీ అయ్యారు.

12/07/2017 - 00:54

హైదరాబాద్, డిసెంబర్ 6: దేశంలో ఎన్‌ఎండీసీ నేతృత్వంలో ఉక్కు ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసే అంశం పరిశీలనలో ఉందని ఈ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బైజేంద్రకుమార్ తెలిపారు. ఎన్‌ఎండిసి ఏర్పాటై అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 8 న ప్రత్యేకంగా వజ్రోత్సవం హైదరాబాద్ (శిల్పకళావేదిక) లో నిర్వహిస్తున్నామన్నారు.

12/07/2017 - 00:53

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ జోహ్రీకి అరుదైన గౌరవం లభించింది. స్పోర్ట్స్‌బిజినెల్ డాట్ కామ్ నిర్వహించిన ఒక సర్వేలో, ఈ ఏడాది అత్యుత్తమ బిజినెన్ ఎగ్జిక్యూటివ్స్ ‘టాప్-10’ జాబితాలో జోహ్రీ నాలుగో స్థానాన్ని సంపాదించాడు.

Pages