S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/09/2017 - 01:53

ముంబయి, డిసెంబర్ 8: దేశంలోని అగ్ర స్థానంలో ఉన్న వంద కంపెనీలు కలిసి మార్కెట్ విలువ ప్రకారం గత అయిదేళ్లలో రికార్డు స్థాయిలో రూ. 38.9 లక్షల కోట్ల సంపద సృష్టించాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. టాటా గ్రూపునకు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ జాబితాలో వరుసగా అయిదోసారి అగ్ర స్థానం లో నిలిచింది.

12/09/2017 - 01:50

ముంబయి, డిసెంబర్ 8: దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) ఎడతెరిపి లేకుండా కొనుగోళ్లు జరపడంతో శుక్రవారం మార్కెట్లు బాగా పుంజుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ- రెండూ కూడా పైకి ఎగబాకాయి.

12/09/2017 - 01:47

హైదరాబాద్, డిసెంబర్ 8: సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (జైపూర్) నవంబర్‌లో 90.28 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పిఎల్‌ఎఫ్) సాధించి జాతీయ స్థాయిలో 7వ స్థానాన్ని పొందిందని ఆ సంస్థ సిఎండి ఎన్.శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. 2017లో థర్మల్ విద్యుత్ కేంద్రం జాతీయ స్థాయిలో మూడుసార్లు మొదటి 10 స్థానాల్లో నిలిచినందుకు ఉద్యోగులను అభినందిస్తూ, ఇకముందు కూడా మెరుగ్గా పని చేయాలని కోరారు.

12/09/2017 - 01:46

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: దేశంలోని 461కి పైగా జిల్లాల్లో గల ఎంప్లారుూస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) దేశ జనాభాలో సుమారు పది శాతం మందికి తన సేవలు అందిస్తోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోశ్ గంగ్వార్ తెలిపారు. ‘ఎంప్లారుూస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్‌ఐ) పథకం ప్రస్తుతం 461 జిల్లాల్లో ఉంది.

12/09/2017 - 01:42

హైదరాబాద్, డిసెంబర్ 8: తెలంగాణలో భారత దేశపు అతిపెద్ద ఆతిథ్య రంగ కంపెనీ ఓయో అడుగుపెట్టింది. ఆతిథ్యరంగంలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఓయో తన నూతన టెక్ డెవలెప్‌మెంట్ సెంటర్‌ను హైదారాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌ను రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖల మంత్రి కెటిఆర్ శుక్రవారం ప్రారంభించారు.

12/09/2017 - 01:40

హైదరాబాద్, డిసెంబర్ 8: మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా పవరోల్ అత్యధిక కెవిఏ డీజిల్ జనరేటర్స్ (డిజి)ను శుక్రవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. 250/320 కెవిఏ డిజిల ఆవిష్కరణ జరిగింది.

12/08/2017 - 00:40

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: మ్యూచువల్ ఫండ్‌లను, పోర్ట్ఫోలియో మేనేజర్లను కమాడిటి డెరివేటివ్స్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించాలని సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) గురువారం ప్రతిపాదించింది.

12/08/2017 - 00:39

ముంబయి, డిసెంబర్ 7: వరుసగా రెండు రోజులు పడిపోయిన దేశీయ మార్కెట్లు గురువారం పుంజుకున్నాయి. ఇటీవల ధరలు పడిపోయిన బ్యాంక్, ఆటో, లోహపు రంగాలకు చెందిన షేర్లను తక్కువ స్థాయి వద్ద కొనుగోలు చేయడానికి మదుపరులు పూనుకోవడంతో మార్కెట్ ప్రధాన సూచీలు పైకి ఎగబాకాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 352 పాయింట్లు పుంజుకుంది.

12/08/2017 - 00:39

హైదరాబాద్, డిసెంబర్ 7: ఫిలిప్పీన్స్‌లో అంతర్జాతీయ కొత్త టర్మినల్ విమానాశ్రయం నిర్మాణానికి తుది బిడ్‌కు సంబంధించి ఎంపికైన సంస్థల్లో జిఎంఆర్ గ్రూపుఅర్హత సాధించినట్లు జిఎంఆర్ సంస్ధ పేర్కొంది. ఈ బిడ్ విలువ 250 మిలియన్ల డాలర్లు. మొత్తం ఏడు కంపెనీల్లో ఐదు కంపెనీలు అర్హత సాధించినట్లు తెలిపారు. ఇందులో జిఎంఆర్ మెగావైడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నాల్గవ స్థానం సాధించింది.

12/08/2017 - 00:38

హైదరాబాద్, డిసెంబర్ 7: రాష్ట్రంలో కందుల కొనుగోలుకు హాకాను కూడా నోడల్ ఏజన్నీగా ఎంపిక చేశారు. ఇప్పటికే మార్క్‌ఫెడ్ కందుల కొనుగోలుకోసం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోందని, కందులు ఎక్కువ మొత్తంలో మార్కెట్లోకి వస్తుండటం వల్ల హాకా కూడా కందులు కొనుగోలు చేసేందుకు వీలుగా అవకాశం ఇచ్చారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి పేరుతో గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Pages