S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/07/2017 - 00:53

హైదరాబాద్, డిసెంబర్ 6: రైల్వేలో భద్రత, సమయ పాలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రైల్వే బోర్డు చైర్మన్ అశ్వనీ లోహానీ అన్నారు. భద్రత, నిర్వహణ వంటి అంశాల్లో దక్షిణ మధ్య రైల్వే అద్భుతంగా పని చేస్తోందని ప్రశంసించారు. ఉత్తర, దక్షిణ భారత దేశ కార్యాచరణ పద్దతులను సమన్వయం చేస్తూ తనదైన ప్రత్యేక గుర్తింపును నిలుకుంటున్నదని కొనియాడారు.

12/07/2017 - 00:52

అమరావతి, డిసెంబర్ 6: పెట్టుబడుల విస్తరణకు, ఆంధ్రప్రదేశ్‌ను సరైన స్థానంగా గుర్తించినట్లు కియా సంస్థ ప్రెసిడెంట్ హూన్‌వూ పార్క్ స్పష్టం చేశారు. దక్షిణ కొరియా పర్యటనలో మూడోరోజు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం పాల్గొన్న కియా మోటార్స్, కొరియాలోని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన సంయుక్త బిజినెస్ సెమినార్‌లో హూన్ వూ పార్క్ ప్రసంగించారు. భారత మార్కెట్ వాల్యూపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

12/06/2017 - 00:51

ముంబయి, డిసెంబర్ 5: తాజా పరిణామాల నేపథ్యంలో కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ ఏమాత్రం తగ్గించే అవకాశం కనిపించడం లేదు. ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ సారథ్యంలో రెండురోజులపాటు జరిగే ద్రవ్య విధాన కమిటీ సమావేశం మంగళవారం ఇక్కడ మొదలైంది. అయితే నిపుణుల అంచనాల ప్రకారం ఆర్థిక, విత్తపరమైన అనేక అంశాలను ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నప్పటికీ వడ్డీ రేట్లను మాత్రం తగ్గించే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది.

12/06/2017 - 00:49

వాషింగ్టన్, డిసెంబర్ 5: వివాదాస్పద నిర్ణయాలతో దూకుడుగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ విజయం దక్కింది. ముస్లిం దేశాల నుంచి ప్రజలు అమెరికాకు వలస రాకుండా ట్రంప్ ‘ట్రావెల్ బ్యాన్’ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొన్ని సడలింపులతో అమలవుతున్న ఆ నిషేధంపై అమెరికా సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును ఇచ్చింది.

12/06/2017 - 00:48

హైదరాబాద్, డిసెంబర్ 5: పరిశోధనలు, పనితీరు, సామర్ధ్యం మెరుగుపరుచుకోవడంపై దక్షిణ మధ్య రైల్వే, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంస్థలు మంగళవారం అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ అవగాహన పత్రంపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్, బిజినెస్ స్కూల్ డీన్ ప్రొఫెసర్ రాజేంద్ర శ్రీవాత్సవ రైల్ నిలయంలో జరిగిన కార్యక్రమంలో సంతకాలు చేశారు.

12/06/2017 - 00:46

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: వంటగ్యాస్ (ఎల్‌పీజీ) కనెక్షన్లను ఉచితంగా పొందుతున్న 3.2 కోట్ల మంది మహిళల్లో దాదాపు 60 శాతం మంది ఏటా సగటున నాలుగేసి సిలిండర్లు తీసుకుంటున్నారని కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. 2016 మే 1న ప్రారంభించిన ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ (పిఎంయువై) కింద 3.2 కోట్ల గ్యాస్ కనెక్షన్లను పేద మహిళలకు ఉచితంగా మంజూరు చేశామని చెప్పారు.

12/06/2017 - 00:45

వివో నుంచి కొత్త మోడల్ వీ7ను మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. రెండు రంగుల్లో విడుదలైన ఈ ఫోన్ ధర 18,990. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకేసారి మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన వీ7ను ఆవిష్కరిస్తున్న వివో ఇండియా సిఎంఓ కెన్నీ జెంగ్.

12/06/2017 - 01:49

విజయవాడ, డిసెంబర్ 5: ఆంధ్రప్రదేశ్‌లో ‘కొరియా ఇండస్ట్రియల్ కాంప్లెక్స్’ త్వరలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు బూసన్‌లో జరిగిన బిజినెస్ సెమినార్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మేకిన్ ఇండియా కొరియా సెంటర్ (ఎంఐసీ) మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. ఎంవోయూలో భాగంగా బూసన్‌లో ఆంధ్రప్రదేశ్ సెంటర్‌ను కూడా నెలకొల్పుతారు.

12/06/2017 - 00:52

అమరావతి, డిసెంబర్ 5: నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి పెట్టుబడులతో వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసే అంశంలో దక్షిణ కొరియాకు అగ్రప్రాధాన్యతనిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

12/05/2017 - 02:46

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: మరో 15 నుంచి 20 రోజుల్లో కొత్త పంటలు మార్కెట్‌లోకి వస్తాయని, దాంతో రిటెయిల్ మార్కెట్‌లో ఉల్లి, టమాట ధరలు తగ్గుతాయని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎస్‌కే పట్నాయక్ తెలిపారు. ‘ఉల్లి, టమాట ధరల పెరుగుదల తాత్కాలిక సమస్య. పరిస్థితి ఖచ్చితంగా మెరుగుపడుతుంది’ అని ఆయన ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ అన్నారు. వ్యాపార గణాంకాల ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి, టమాట ధరలు కిలోకు రూ.

Pages