S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/23/2019 - 23:38

ముంబయి, అక్టోబర్ 23: దేశీయ స్టాక్ మార్కెట్లు ఒకరోజు విరామానంతరం బుధవారం మళ్లీ లాభాల బాటలోకి మళ్లాయి. ఐటీ, ఫైనాన్స్, వాహన స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయంగా ఓవైపు మార్కెట్ల స్థితి మిశ్రమంగా ఉన్నా దేశీయ కార్పొరేట్ కంపెనీల సంతృప్తికర త్రైమాసిక ఫలితాలు మార్కెట్లకు సానుకూలంగా మారాయి. ఆరంభం నుంచి లాభాల ట్రెండ్‌ను కొనసాగించిన బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 330 పాయింట్లు ఎగబాకింది.

10/23/2019 - 23:36

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: విద్యుత్ పరికరాల తయారీ సంస్థ హవెల్స్ ఇండియా బుధవారం త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం రూ. 179.51 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్టు నివేదించింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ కంపెనీకి రూ. 179.70 కోట్ల లాభం సమకూరగా తాజాగా అది స్వల్పంగా తగ్గింది. నిర్వహణ (ఆపరేషన్స్) విభాగం ఆదాయం 1.75 శాతం పెరిగి రూ. 2,232.65 కోట్లకు చేరింది.

10/23/2019 - 23:35

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) తాజాత్రైమాసిక లాభాల్లో 23.5 శాతం వృద్ధి నమోదవడంతో ఆ బ్యాంకు వాటాలు బుధవారం 2 శాతం లాభపడ్డాయి. గత సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 23.5 శాతం లాభాల వృద్ధితో రూ. 126 కోట్ల నికర లాభాన్ని ఈ బ్యాంకు ఆర్జించింది. ఈక్రమంలో బీఎస్‌ఈలో వాటా విలువ 2.39 శాతం పెరిగి ఒక్కోవాటా రూ. 51.45 వంతున ట్రేడైంది. అలాగే ఎన్‌ఎస్‌ఈలో 2.18 శాతం వృద్ధితో రూ.

10/23/2019 - 23:34

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: దేశ రాజధాని వాసులకు టమోటో ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈక్రమంలో ప్రభుత్వ రంగ సంస్థ మదర్‌డైరీని ధరలు తగ్గించి విక్రయించాల్సిందిగా బుధవారం ఆదేశించింది. కిలోమీద 2 నుంచి 3 రూపాయలు ధర తగ్గించాలని సూచింది.

10/23/2019 - 23:34

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: భారత స్టాక్ మార్కెట్ ఎక్చేంజ్ (బీఎస్‌ఈ) ఇన్ఫోసిస్ వ్యవహారంలో గోప్యతలపై గుర్రుగా ఉంది. కంపెనీ శ్రేయోభిలాష ఉద్యోగుల బృందం (విజిల్‌బ్లోయర్స్) పేరిట వెలువడిన కంపెనీ అత్యున్నత కార్యనిర్వాహకులపై తీవ్ర స్థాయి ఆరోపణలతో కూడిన లేఖ, ఫిర్యాదుల విషయాలను ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చిందో వివరించాలంటూ ఇన్ఫోసిస్‌ను బీఎస్‌ఈ ఆదేశించింది.

10/23/2019 - 05:23

ముంబయి: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవోపై అవినీతి ఆరోపణలు రావడంతో మంగళవారం ఒక్క సారిగా ఆ కంపెనీ వాటాలు 16 శాతం నష్టపోయి మొత్తం దేశీయ స్టాక్‌మార్కెట్లను నష్టాల్లోకి లాగాయి. వరుసగా ఆరు రోజులు లాభాల్లో సాగి ఊపుమీదున్న స్టాక్ మార్కెట్లకు ఇలా అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది. దీంతో బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 334.54 పాయింట్లు కోల్పోయి 0.85 శాత నష్టాలతో 38,924.85 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది.

10/22/2019 - 23:42

మదనపల్లె, అక్టోబర్ 22: పల్లెల్లో సాగుచేసిన టమోటా పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఢిల్లీకి ఎగుమతి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈమేరకు ఆయా మార్కెట్లకు అన్నిరకాల కూరగాయలు, టమోటాల కొనుగోలు, వాటి మార్కెటింగ్, కూలీ తదితర వివరాలతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న ఆదేశాలు జారీ చేశారు.

10/22/2019 - 22:42

ముంబయి, అక్టోబర్ 22: ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు మంగళవారం చేపట్టిన దేశవ్యాప్త ఒక రోజు సమ్మె కారణంగా బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడింది. కేంద్రం చేపట్టిన బ్యాంకుల విలీన కార్యక్రమాన్ని వ్యితిరేకిస్తూ ఈ ఆందోళన కార్యక్రమం సాగింది. గత ఆగస్టులో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా మార్చనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

10/22/2019 - 22:40

ముంబయి, అక్టోబర్ 22: గోల్డ్‌లోన్ ఫైనాన్షియల్ దిగ్గజం ముత్తూట్ పైనాన్స్ మూడేళ్ల డాలర్ బాండ్ల విక్రయాల ద్వారా 50 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించింది. ఇందుకోసం 6.125 శాతం వార్షిక కూపన్‌ను ఆ కంపెనీ ఆఫర్ చేసింది. ఇలా ఓ బంగారు రుణాల కంపెనీ డాలర్ రుణ మార్కెట్‌లోకి ప్రవేశించడం మనదేశంలో ఇదే తొలిసారి.

10/22/2019 - 22:38

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్‌పరేఖ్‌పై అవినీతి ఆరోపణలతో రావడంతో దీనిపై స్వతంత్ర అంతర్గత ఆడిటర్ల అకౌంటింగ్ సంస్థ (ఈవై)తో విచారణ జరిపించేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఐటీ దిగ్గజ సంస్థలో అంతర్గతంగా సాగుతున్న కోల్డ్‌వార్‌తో రెండేళ్ల క్రితమే అప్పటి అధినేత విశాల్ సిక్కా కంపెనీ నుంచి రాజీనామా చేసి వెళ్లిపోవడం జరిగింది.

Pages