S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/01/2019 - 00:09

బీజింగ్‌లో చైనా సర్కారు ఏర్పాటు చేసిన ఫీటీ ఎక్స్‌పోలో టెక్నాలజీ సంస్థ జెడ్‌టీఈకి చెందిన 5జీ సేవలకు సంబంధించిన డిప్లే. అమెరికాతో వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో, ఎలక్ట్రానిక్ సహా పలు రంగాల్లో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని చైనా ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే వివిధ సంస్థలను ఆహ్వానించి ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నది.

11/01/2019 - 00:06

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: బులియన్ మార్కెట్‌లో గురువారం 10 గ్రాముల బంగారం ధర 115 రూపాయలు పెరిగి, 39,017 రూపాయలకు చేరింది. 38,902 రూపాయల ప్రారంభ ధరతో మొదలైన ట్రేడింగ్‌లో లాభాల్లోనే నడిచింది. రూపాయి మారకం విలువ స్వల్పంగా పతనం కావడంతో, పసిడికి డిమాండ్ పెరిగింది. మదుపరులు బులియన్ మార్కెట్‌పై ఆసక్తి చూపడంతో, బంగారం ధర పెరిగింది. కాగా, కిలో వెండి ధర 95 రూపాయలు పెరిగి, 47,490 రూపాయల వద్ద ముగిసింది.

10/31/2019 - 05:30

న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటాలు బుధవారం దాదాపు 17 శాతం లాభపడ్డాయి. ప్రాధాన్యతా ప్రాతిపదికన ప్రభుత్వానికి వాటాలను కేటాయించేందుకు, తద్వారా రూ. 3,353 కోట్లు సమీకరించేందుకు ఆ బ్యాంకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్టాక్ మార్కెట్లో వాటాల విలువ భారీగా పెరిగింది. బీఎస్‌ఈలో ఈ బ్యాంకు వాటాలు 15.32 శాతం లాభపడి ఒక్కోవాటా రూ. 20.70కి చేరగా, ఇంట్రాడేలో ఈ ధర రూ. 19.77 నుంచి 21.50 చేరింది.

10/31/2019 - 00:59

న్యూఢిల్లీ, అక్టోబర్ 30: ఇంతకాలం నల్లధనం వెలికితీతపై దృష్టి సారించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పుడు అక్రమంగా నిల్వ ఉంచిన బంగారంపై దృష్టి కేంద్రీకరిస్తోంది. నల్ల ధనంతో కొనుగోలు చేసిన బంగారాన్ని వెలికితీసేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రకటించనున్నట్లు తెలిసింది.

10/30/2019 - 23:50

న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫలితాలను ఆసక్తిగా తిలకిస్తున్న మార్కెట్ స్పెషలిస్ట్ అంథోనీ రినాల్డి, వర్తకుడు తిమోతి నిక్. ఫెడరేషన్ రిజర్వ్ వడ్డీ రేట్లను త్వరలోనే ప్రకటించనున్న నేపథ్యంలో వాల్ స్ట్రీట్ ట్రేడర్లు తమ వాటాలను స్తబ్దంగా ఉంచారు. దీంతో బుధవారం యూఎస్ స్టాక్ మార్కెట్ పతనమైంది.

10/30/2019 - 23:48

ముంబయి, అక్టోబర్ 30: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ లాభాల పరుగును కొనసాగించాయి. కార్పొరేట్ కంపెనీల బలమైన త్రైమాసిక ఫలితాలు, ఈక్విటీల్లో మదుపుచేసే వారికి ఆదాయ పన్ను తగ్గింపు ఉండవచ్చన్న అంచనాల క్రమంలో పెట్టుబడిదారుల సెంటిమెంటుపై సానుకూల ప్రభావం చూపింది. దీంతో బుధవారం సైతం సూచీలు మంచి లాభాలను నమోదు చేశాయి.

10/30/2019 - 23:45

న్యూఢిల్లీ, అక్టోబర్ 30: తమకున్న అప్పులన్నింటినీ కాల వ్యవధిలోగా తీర్చేస్తామని వొడాఫోన్ ఐడియా సంయుక్త సంస్థ బుధవారం నాడిక్కడ తెలిపింది. తమ సంస్థ ఇప్పటి వరకు రుణ భారాన్ని తగ్గించాలని కానీ, రుణాల చెల్లింపునకు కాల వ్యవధులను పొడిగించాలని కానీ ఏ బ్యాంకునూ కోరలేదని స్పష్టం చేసింది. తమ సంస్థ రూ.

10/30/2019 - 23:43

న్యూఢిల్లీ, అక్టోబర్ 30: ‘నెస్కో లిమిటెడ్’ సంస్థ ముంబయి నగరంలోని తన 6 లక్షల చదరపు అడుగుల ప్రధాన కార్యాలయ నిర్మాణాలను బుధవారం లీజుకిచ్చింది. ఇందులో ‘హియర్ టెక్నాలజీస్’, ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి ప్రముఖ కంపెనీలున్నాయి. ఇటీవల స్థిరాస్తి వ్యాపారం, ఎగ్జిబిషన్ సెంటర్, ఆహార పానీయాలు, ఇంజనీరింగ్ వ్యాపారంలోకి నెస్కో ప్రవేశించింది.

10/30/2019 - 22:42

తమకు న్యాయం చేయాలన్న డిమాండ్‌తో ముంబయిలోని పంజాబ్, మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకు కార్యాలయం ముందు బుధవారం ధర్నాకు దిగిన ఆ బ్యాంకు ఖాతాదారులు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు

10/30/2019 - 05:39

ముంబయి : దీపావళి తర్వాత ‘సంవత్ 2076’లో తొలి వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు తారాజువ్వల్లా దూసుకుపోయిన లాభాలతో ఆరంభించాయి. త్వరలో కేంద్ర ప్రభుత్వం మరిన్ని ఆర్థిక ఉద్దీపన చర్యలు చేపడుతుందని, ఆదాయ పన్నులోనూ కోత విధించే అవకాశాలున్నాయని వెలువడిన విశే్లషణలు మార్కెట్లకు మంచి ఊపునిచ్చాయి.

Pages