S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/29/2019 - 23:47

హైదరాబాద్, అక్టోబర్ 29: దేశాభివృద్ధికి బ్యాంకులు విశేష సేవలు అందిస్తున్నాయని ఆంధ్రాబ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుల్ భూషణ్ జైన్ అన్నారు. మంగళవారం ఇక్కడ సమగ్రత, జీవన విధానం లక్ష్యంతో ఆంధ్రాబ్యాంకు విజిలెన్స్ వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాన కార్యాలయం నుంచి బ్రాంచిల వరకు సిబ్బంది నిర్వహించి ప్రజలకు నాణ్యమైన బ్యాంకింగ్ సేవలు అందించాలన్నారు.

10/29/2019 - 23:44

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: ఆర్థికంగా వెనుకబడిన ఝార్ఖండ్, చత్తీస్‌ఘడ్, బీహార్ రాష్ట్రాలతోబాటు, ఈశాన్య ప్రాంతాలకు ‘కార్పొరేట్ సామాజిక బాధ్య త’ (సీఆర్‌ఎస్)ను విస్తరించాల్సిందిగా ప్రభుత్వ, కార్పొరేట్ సంయుక్త సేవా వేదిక ‘ఇండియా ఇంక్’కు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు.

10/29/2019 - 23:42

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా లాభపడడంతో మదుపర్ల సంపద ఒక్క రోజులోనే రూ. 2.73 లక్షల కోట్లు పెరిగింది. 30 షేర్ల సూచీ సెనె్సక్స్ నాలుగు నెలల గరిష్టం 581.64 పాయింట్లు ఎగబాకిన క్రమంలో బీఎస్‌ఈ జాబితాలోని కార్పొరేట్ కంపెనీల మార్కె ట్ విలువ ఒక్క రోజులోనే రూ. 2,73,355.21 కోట్లు పెరిగి మొత్తం రూ. 1,52,04,693.34 కోట్లకు చేరింది.

10/29/2019 - 23:42

న్యూయార్క్, అక్టోబర్ 29: భారత మూలాలు కలిగిన ముగ్గురు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు ‘ప్రపంచ అత్యుత్తమ సమర్థ టాప్‌టెన్ సీఈవోల’ జాబితాలో చోటుదక్కింది. ఈమేరకు హార్వర్డ్ బిజినెస్ రివ్యూ (హెచ్‌బీఆర్) మేగజైన్ 2019వ సంవత్సరానికి ప్రపంచంలో అత్యుత్తమ సమర్థతను కనబరుస్తున్న 100 మంది సీఈవోల జాబితాను రూ పొందించింది.

10/29/2019 - 22:54

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: రైల్వే టిక్కెట్ల రద్దు, రీఫండ్‌లకు సంబంధించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభతరమైన విధానాన్ని రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. అధీకృత ఏజెంట్ల ద్వారా రిజర్వ్ చేసుకున్న టిక్కెట్లను రద్దు చేసుకున్న పక్షంలో రీఫండ్లకు సంబంధించి ఓటీపీ విధానాన్ని ప్రవేశపెట్టింది. అధీకృత ఏజెంట్ల ద్వారా జరిగే టిక్కెట్ బుకింగ్‌లో పారదర్శకత పెంపొందుతుందని తెలిపింది.

10/29/2019 - 05:37

ముంబయి: పసిడి ధరలు మరింత పైపైకి వెళ్లనున్నాయా? అవునంటున్నారు వాణిజ్య విశే్లషకులు. భౌగోళిక, రాజకీయ అనిశ్చితి, సెంట్రల్ బ్యాంకు స్థిరమైన కొనుగోళ్లు, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీన పడడం వంటి కారణాలు బంగారం మార్కెట్లకు మరింత ఊతమిచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఈక్రమంలో పసిడి ధరలు రెక్కలు తొడిగి ఈ ఆర్థిక సంవత్సరాంతానికి 10గ్రాములు రూ. 42 వేల వరకు ఎగబాకే వీలుందని అంటున్నారు.

10/28/2019 - 23:40

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) అన్ని డిజిటల్ వ్యవహారాల నిర్వహణకు ఓ ప్రత్యేక అనుబంధ విభాగాన్ని ఏర్పాటు చేయబోతోంది. సంస్థలో పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రత్యేక విభాగం రూపుదిద్దుకోబోతోంది. ఆర్‌ఐఎల్ తన అధీనంలోని టెలికాం, డిజిటల్ వాణిజ్యాన్ని పునర్‌వ్యవస్థీకరించే పనిలో ఉంది.

10/28/2019 - 23:39

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌పై భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఇర్దాయ్) సోమవారం రూ.4 లక్షల జరిమానా విధించింది. ప్రకటనల (అడ్వర్టయిజ్‌మెంట్లు) విషయంలోను, పాలసీదారుల ప్రయోజనాలు రక్షించడంలోనూ నిబంధనలకు తిలోదకాలిచ్చినందుకే ఇలా ఇర్దాయ్ కొరడా ఝళిపించినట్టు తెలిపింది.

10/28/2019 - 23:38

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: వడ్డీ రేట్లపై అమెరికన్ ఫెడరేషన్ నిర్ణయం, దేశీయంగా కార్పొరేట్ కంపెనీల ఫలితాలు ప్రధానంగా ఈ వారం స్టాక్ మార్కెట్ల తీరును నిర్ధేశిస్తాయని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. దీపావళి పర్వదిన సందర్భంగా సోమవారం ఒక రోజు సెలవుతో కూడిన ఈ వాణజ్య వారం మూడు రోజులే స్టాక్‌మార్కెట్లు పనిచేస్తాయి. ప్రధానంగా ఈ వారంలో వాహన కంపెనీలు త్రైమాసిక ఫలితాలు వెలువరించనున్నాయి.

10/28/2019 - 23:23

విశాఖపట్నం, అక్టోబర్ 28: అంతర్జాతీయ మార్కెట్‌లో అరకు కాఫీకి విశేష ఆదరణ లభిస్తోంది. పారిశ్రామిక సదస్సులకు కేంద్ర బిందువుగా ఉన్న విశాఖ నగరంలో గతంలో జరిగిన అనేక జాతీయ స్థాయి కార్యక్రమాల్లో అరకుకాఫీకి విశిష్ట స్థానం లభించి ప్రపంచ దేశాలకు ఇక్కడి అరకుకాఫీ రుచి చూసినట్టు అయ్యింది. షాపింగ్‌మాల్స్, ఆన్‌లైన్ మార్కెటింగ్, రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టాళ్ళ ద్వారా నిర్వహించే అమ్మకాలకు ఆదరణ లభిస్తోంది.

Pages