-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
ముంబయి, అక్టోబర్ 16: అంతర్జాతీయంగా మార్కెట్ల స్థితిగతులు మిశ్రమంగానే ఉన్నప్పటికీ దేశీయంగా ఫైనాన్స్, ఇంధన రంగాల్లో భారీగా వాటాల కొనుగోళ్లు జరగడంతో స్టాక్ మార్కెట్లు నాలుగో రోజైన బుధవారంనాడూ లాభాల బాటలో సాగాయి. ఐతే ఆ లాభాలు ఓ మోస్తరు స్థాయికే పరిమితం కావడం గమనార్హం. సూచీలు రోజంతా ఒడిదుకులకు గురైన క్రమంలో బీఎస్ఈ 30 షేర్ల సెనె్సక్స్ ఓ దశలో 250 పాయింట్ల ఆధిక్యతకు ఎగబాకింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ఈనెల 22న చేపట్టిన అఖిల భారత బ్యాంకుల సమ్మెకు ఆలిండియాట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) బుధవారం మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బ్యాంకుల విలీన ప్రక్రియ న్యాయ సమ్మతం కాదని ఆ కార్మిక సంఘం విమర్శించింది.
విశాఖపట్నం : నవ్యాంధ్రలో ఎయిర్ ఇండియా సేవలు మరింత పెరగనున్నాయి. ఆదరణ ఉన్నప్పటికీ వివిధ కారణాల రీత్యా రద్దయిన సర్వీసులను తిరిగి పునరుద్ధరించడంతో పాటు కొత్తగా మరికొన్ని సర్వీసులు నడిపేందుకు ఎయిర్ ఇండియా సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డికి ఎయిర్ ఇండియా చైర్మన్ అశ్వనీ లోహాని లేఖ రాశారు.
ముంబయి, అక్టోబర్ 15: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజైన మంగళవారం సైతం లాభాల బాటలో నడిచాయి. అమెరికా-చైనా వాణిజ్య చర్చలు ఫలప్రదంగా సాగుతుండడంతోబాటు, వినిమయ డిమాండ్ ఈ పండుగ సీజన్లో పుంజుకుంటుందన్న అంచనాలు మదుపర్లకు ప్రోత్సాహాన్నించిందని విశే్లషకులు భావిస్తున్నారు. ఈక్రమంలో బీఎస్ఈ బెంచ్మార్క్ సూచీ సెనె్సక్స్ పరుగులుపెట్టి ఏకంగా 421 పాయింట్లు ఎగబాకి ఆ తర్వాత దిద్దుబాటుకు గురైంది.
గణపురం, అక్టోబర్ 15: తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ) రెండవ దశ 600 మెగావాట్ల ప్లాంటులో మంగళవారం సింక్రనైజేషన్ ప్రారంభమైంది. ఈనెల 6వ తేదీన స్టీమ్ విభాగంలో సాంకేతిక సమస్యలు ఉండగా ప్లాంటును నిలిపివేశారు.
ముంబయి, అక్టోబర్ 15: అర్బన్ సహకార బ్యాంకులను రెండు రకాల పరిధుల్లో కాకుండా మొత్తంగా రిజర్వు బ్యాంకు నియంత్రణ పరిధిలోకి చేర్చాలని అఖిల భారత రిజర్వు బ్యాంకు ఉద్యోగుల సంఘం మంగళవారం నాడిక్కడ సూచించింది. పంజాబ్, మహారాష్ట్ర సహకార బ్యాంకు (పీఎంసీబీ)లో భారీ కుంభకోణం చోటుచేసుకున్న దృష్ట్యా అలాంటివి పునరావృతం కాకుండా ఆర్బీఐ చొరవ తీసుకోవాలని కోరింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 15: బెంగుళూరు ప్రధాన కేంద్రంగా నడిచే దిగ్గజ కంపెనీ ‘విప్రో లిమిటెడ్’ గత సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసిక ఫలితాలను మంగళవారం నాడిక్కడ వెల్లడించింది. మొత్తం రూ. 2,552.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఈ త్రైమాసికంలో ఆర్జించినట్టు తెలిపింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ లాభం 35 శాతం అధికమని పేర్కొంది. అలాగే ఈకాలంలో రూ. 15,875.4కోట్ల ఆదాయం ఆర్జించినట్టు తెలిపింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 15: ప్రస్తుత మొబైల్ సేవల ధరలను మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని టెలికాం ఆపరేటర్ ‘్భరతీ ఎయిర్టెల్’ మంగళవారం నాడిక్కడ పేర్కొంది. ప్రస్తుత ధరలు కంపెనీల స్థిరమైన వృద్ధికి తోడ్పడేవిగా లేవని ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, భారత, దక్షిణాసియా దేశాల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోపాల్ విట్టల్ తెలిపారు.
వాషింగ్టన్, అక్టోబర్ 15: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మంగళవారం 2019వ సంవత్సరానికి భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాను 6.1 శాతానికి కుదించింది. ఈ సంవత్సరం ఏప్రిల్లో వేసిన అంచనాతో పోలిస్తే ఇది 1.2 శాతం తక్కువ. భారత్ 2019 సంవత్సరంలో 7.3 శాతం వృద్ధి సాధిస్తుందని ఐఎంఎఫ్ ఏప్రిల్లో ప్రకటించింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం తీవ్ర ఒడిదుడుకులకు గురికాగా అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో ప్రగతితో వచ్చిన సానుకూలతలతో చివరికి రెండు సూచీలూ స్వల్ప లాభాలను నమోదు చేశాయి. ఒక దశలో 448 పాయింట్లు ఎగబాకిన బీఎస్ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ తర్వాత నేల చూపులు చూసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 38,513.69 పాయింట్ల గరిష్టాన్ని, 38,068.13 పాయింట్ల కనిష్టాన్ని స్పృశించింది.