S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

08/22/2016 - 07:32

మతప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లవని కోర్టులు చెప్పినా, బీసీలకు ఉద్దేశించబడిన రిజర్వేషన్ల శాతంలో హిందువులకు నాలుగుశాతం తగ్గించి కొన్ని ముస్లిం వర్గాలకు, కులం పేరు తగిలించి, తెలుగు రాష్ట్రాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూనే ఉన్నారు. దీన్ని 12 శాతానికి పెంచడానికి రాజ్యాంగాన్ని సవరింపచూస్తున్నారు.

08/21/2016 - 00:53

నెహ్రూ అన్నట్టు 1947 ఆగస్టు 15న రాత్రి ప్రపంచమంతా నిద్రపోతుండగా భారతదేశం స్వాతంత్రంతో మేల్కొ నింది. స్వాతంత్య్రంతోపాటే భారతీయ మహిళ కూడా మేల్కొన్నదనే చెప్పాలి. స్వాతంత్య్రానికి ముందు కళాశాల స్థాయిలో వున్న విద్యార్థులను వేళ్లపై లెక్కించే స్థాయలో ఉండేది. ఉన్నత కుటుంబాలలోని స్ర్తిలు తప్ప సాధారణ కుటుంబాలలోని స్ర్తిలకు విద్యావకాశాలు, వసతులు సౌకర్యాలు అందని ద్రాక్షపండ్లే.

08/20/2016 - 08:14

తన అనర్గళమైన వాగ్ధాటితో, అనితర ధైర్య సాహసాలతో, త్యాగాలతో జాతికి స్ఫూర్తినిచ్చిన చైతన్యమూర్తి బాలగంగాధర తిలక్. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాటుచేసిన విప్లవవీరుడు. తిలక్ రంగంలోకి ప్రవేశించకముందు భారత జాతీయ కాంగ్రెస్ కలాపాలు సమావేశాలకు, తీర్మానాలకు మాత్రమే పరిమితమై ఉండేవి. తిలక్ అవలంబించిన దృఢ వైఖరి వల్లనే కాంగ్రెస్ ఒక శక్తివంతమైన సంస్థగా రూపొందింది.

08/18/2016 - 23:33

దార్శకునిలు మరియు స్ఫూర్తిప్రదాత అయినటువంటి మన మాజీ రాష్టప్రతి డా.ఎ.పి.జె.అబ్దుల్‌కలాం ‘‘మన దేశానికున్న గొప్ప వనరులు మానవ వనరులే’’ అని తరచుగా అంటుండేవారు. జనాభాపరంగా, వాణిజ్యపరంగా, పారిశ్రామికంగా భారతదేశానికి మంచి అనుకూల వాతావర ణం ఏర్పడినా మన యువతకు ఉపాధి అవకాశాలను కల్పించలేక పోతున్నాం. దానికి కారణం ఉపాధి అవకాశాలు లేకపోవ డం కాదు.

08/18/2016 - 23:32

తెలుగు రాష్ట్రాల్లో ఫీజు రియంబర్స్‌మెంట్ స్కీంకోసం ప్రైవేట్ వృత్తి విద్యాకాలేజీలు వౌలిక వసతులు శూన్యమై విజిలెన్స్, తనిఖీలతో బెంబేలెత్తిపోయారు. ఎంబీఏ, ఫార్మసీ, బిఇడీ, ఎంఈడీ, బీపిఈడి, ఎం.్ఫర్మసీ, లా, ఇంజనీరింగ్ పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ కాలేజీల్లో ప్రభుత్వాలు నిర్దేశించిన నిబంధనలు లేవు. భావితరాలకు బోధించే గురువులను తీర్చిదిద్దే వృత్తి విద్యా కళాశాలలు అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్నాయి.

08/17/2016 - 23:26

దివంగత పీసపాటి నరసింహమూర్తి ఆరు దశాబ్దాల కాలం నటసింహమై తనకి తానే సాటి అనిపించుకున్న గొప్ప కళాప్రపూర్ణుడు. ఆయన మహానటుడే గాక తెలుగు నాటక రం గంలో పెనుమార్పులు తెచ్చిన నటనకు భాష్యం చెప్పి నూతన ఒరవడిని భావితరం కళాకారులకందించిన గొప్ప దార్శనికుడుగా అసమాన ఖ్యాతి నార్జించారు.

08/17/2016 - 23:25

కెసిఆర్ నాయకత్వంలో 2014, జూన్ 2న అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కేజీ టూ పిజి ఉచిత విద్యను అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. అరవై ఏళ్ల పాలనలో ప్రభుత్వాలు క్రమంగా ప్రభుత్వ రంగాలను నిర్వీర్యపరుస్తూ ముఖ్యంగా సగటు బడుగుజీవికి విద్యా, వైద్యరంగాలను దూరంచేశాయి. సంపన్నులకు ఒక చదువు, సామాన్యులకు ఒక చదువైంది. ఈ నేపథ్యంలో కెసిఆర్ ప్రకటించిన కె.జి.

08/16/2016 - 23:38

ఒకప్పుడు విద్య పరమావధి జ్ఞాన సముపార్జన. వ్యక్తి తన కాళ్ళపై తాను నిలబడగలననే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవటం. కాలం మారింది. లక్ష్యాలూ మారాయి. ఈనాడు విద్యయొక్క అంతిమ లక్ష్యం ఉద్యోగం సంపాదించి నాలుగురాళ్ళు వెనకేయటం. అదీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా లక్షల ప్యాకేజీ సంపాదించటం. ఆపై న పశ్చిమ దేశాలకు వెళ్ళటం. మా పిల్లలు యూ.యస్.లో ఉన్నారు, జర్మనీ వెళ్ళారు అని చెప్పుకోవటం స్టేటస్ సిం బల్.

08/16/2016 - 23:35

అధిక శాతం దేశ ప్రజల్ని పోషకాహార లేమి బాధిస్తోంది. ప్రతిరోజు తగినన్ని ప్రోటీన్లు, ఇతర సూక్ష్మ పోషకాలు శరీరానికి అందకపోవడమే ముఖ్యకారణమని చెప్పవచ్చు. తెలుగునాట కందిపప్పు, బెంగాల్‌లో మినపప్పు, గుజరాత్‌లో శనగపప్పు విరివిగా వాడతారు. పప్పులు చౌకగా ప్రోటీన్‌ని అందించే దినుసులు. కానీ వాటి ధరలు సామాన్యునికి అందనంత పైకి ఎగిసిపోయాయి. గత రెండు సంవత్సరాల్లో మరీ విపరీతమయ్యాయి.

08/16/2016 - 00:10

తెలంగాణ రాష్ట్రంలో ‘ఒగ్గుకథ’కు ఒక విశిష్ఠమైన స్థానం ఉంది. కాని నేడు ఆదరణ కరవైన ఈ ఒగ్గుకథ కాలగర్భంలో కలిసిపోయే దశకు చేరుకుంది. కొంతమంది ఈ కథలను నేర్చుకొని ఇప్పటికీ అక్కడక్కడ ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నారు. నేటి ఆధునిక యువత ‘సెల్’ ప్రపంచంలో మునిగిపోతోంది. గతంలో లాగా ఒగ్గుకథలు, బుర్రకథలు చిరుతల రామాయణం నేడు చూచేవారు కరవయ్యారు.

Pages