S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/25/2016 - 02:57

లాహోర్, సెప్టెంబర్ 24: కాశ్మీర్ సమస్య పరిష్కారమయ్యే దాకా పాకిస్తాన్‌లో భారతీయ సినిమాలపై నిషేధం విధించాలని కోరుతూ ఓ పిటిషన్ లాహోర్ హైకోర్టులో దాఖలయింది. అజర్ సాదిక్ అనే అడ్వకేట్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

09/25/2016 - 02:57

లాస్ ఏంజెలిస్, సెప్టెంబర్ 24: వాషింగ్టన్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. మహిళలకు సంఘటనా స్థలంలోనే చనిపోగా, చికిత్స పొందుతూ మరొక వ్యక్తి మృతి చెందాడు. కాస్కాడే మాల్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. కాల్పుల ఘటన జరిగిన వెంటనే పోలీసులు హుటాహుటిన మాల్‌కు చేరుకుని దుండగుడి కోసం గాలింపుచేపట్టారు.

09/25/2016 - 02:56

షార్లొటే, సెప్టెంబర్ 24: ఉత్తర కరోలినా పట్టణం షార్లోట్‌లో పోలీసుల కాల్పుల్లో మరణించిన నల్లజాతీయుడు ఖైత్ లామోంట్ స్కాట్ కేసు కొత్త మలుపు తిరిగింది. పోలీసులు కాల్పులకు సంబంధించి సెల్‌ఫోన్ కెమెరా వీడియోను అతడి కుటుంబ సభ్యులు విడుదల చేయడంతో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తన భర్తది ముమ్మాటికీ ఎన్‌కౌంటరేనని, పోలీసులే దారుణంగా కాల్చిచంపారని మృతుడి భార్య రాకియా ఆరోపించారు.

09/25/2016 - 02:54

వాషింగ్టన్, సెప్టెంబర్ 24: ఆఫ్రికన్ అమెరిన్ చరిత్ర, సంస్కృతి ప్రపంచానికి తెలియాల్సి ఉందని అధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపునిచ్చారు. వాషింగ్టన్‌లోని నేషనల్ మాల్‌లో ఏర్పాటు చేసిన స్మిత్‌సోనియా ఆఫ్రికన్ అమెరికన్ మ్యూజియంను శనివారం ఆయన ప్రారంభించారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఈ మ్యూజియం ప్రారంభించిన ఒబామా ఇది మనందరి జీవితాల గురించి తెలుపుతుంది అన్నారు.

09/24/2016 - 18:14

దిల్లీ: జిందగీ ఛానల్‌లో అన్ని పాకిస్థానీ షోలు నిలిపివేసే యోచనలో ఉన్నామని జీ మీడియా, ఎస్సెల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ సుభాష్‌ చంద్ర గోయెల్‌ ట్వీట్‌ చేశారు. ఉరీలో ఉగ్రవాద దాడి ఘటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున భారత్‌లోని జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన జిందగీ ఛానల్‌లో పాకిస్థానీ షోలు నిలిపి వేసే యోచనలో ఉంది. పాకిస్థాన్‌ ఆర్టిస్ట్‌లు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆయన అన్నారు.

09/24/2016 - 03:40

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 23: భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఇప్పటివరకు రెండు యుద్ధాలు జరిగాయి. రెండు దేశాలు దాయాదుల్లాగా నిత్యం ఏదో ఒక విషయంపై గొడవ పడుతూనే వస్తున్నాయి. రెండు దేశాల మధ్య 50 ఏళ్లుగా కాశ్మీర్ వివాదం రావణ కాష్ఠంలాగా కాలుతూనే ఉంది. అయితే ఒక్క విషయంలో మాత్రం రెండు దేశాల మధ్య ఇప్పటివరకు ఎలాంటి పొరపొచ్చాలు తలెత్తలేదు. అదే సింధూ జలాల ఒప్పందం.

09/23/2016 - 15:12

న్యూయార్క్ః అమెరికాలోని న్యూయార్క్ లాగార్డియా ఎయిర్ పోర్టులో గుర్తు తెలియని వాహనం కలకలం రేపింది. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఎయిర్ పోర్ట్ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రయాణీకుల భద్రతను . భద్రతా దళాలు, బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనంతో ఎటువంటి ప్రమాదం లేదని నిర్థారించిన అధికారులు అనంతరం సుమారు గంట తర్వాత ఎయిర్ పోర్ట్ తెరిచేందుకు అనుమతించారు.

09/23/2016 - 15:07

జమ్మూ: భారత్- పాక్ అంతర్జాతీయ సరిహద్దులో బీఎస్ఎఫ్ సిబ్బంది ఓ పాకిస్తాన్ దేశీయుడిని అదుపులోకి తీసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున పర్గ్వాల్ సెక్టార్లో విధులు నిర్వర్తిస్తున్న బీఎస్ఎఫ్ సిబ్బంది భారత్లోకి చొరబడిన వ్యక్తిని గుర్తించారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని సియాల్కొటె సెక్టార్కు చెందిన అబ్దుల్ ఖయూమ్గా గుర్తించి, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నారు.

09/23/2016 - 00:37

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 22: కరడుగట్టిన ఉగ్రవాది, హిజ్‌బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హాన్ వనీని ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్య సమితి (ఐరాస) జనరల్ అసెంబ్లీలో కీర్తించిన పాకిస్తాన్‌పై భారత్ గురువారం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇంతకుముందెన్నడూ ఉపయోగించనంత ఘాటు పదజాలాన్ని వినియోగిస్తూ తన విమర్శలకు పదునుపెట్టింది. అసలు పాకిస్తానే ఒక ‘ఉగ్రవాద దేశం’ అని తెగేసి చెప్పింది.

09/23/2016 - 00:33

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 22: కాశ్మీర్ అంశం సహా భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉన్న ఏ వివాదంలోనూ జోక్యం చేసుకోవడానికి ఐక్యరాజ్య సమితి (ఐరాస) నిరాకరించింది. ఉభయ దేశాలు ద్వైపాక్షిక చర్చలద్వారా తమ మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించింది.

Pages