S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2016 - 02:56

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: న్యాయస్థానాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయముర్తి జస్టిస్ టిఏస్ ఠాకూర్ కంటతడి పెట్టడం తనను కలచివేసిందని తెలంగాణ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయముర్తుల సంయుక్త సమావేశంలో తెలంగాణ తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు.

04/29/2016 - 02:55

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికకు దూరంగా ఉంటున్నట్టు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ చెప్పారు. తగినంత బలం లేనందున తాము ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కరవు నివారణ చర్యలను చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.

04/29/2016 - 02:54

విశాఖపట్నం, ఏప్రిల్ 28: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు (ఎపిసెట్) నిర్వహణకు ఆంధ్రా విశ్వవిద్యాలయానికి యుజిసి అనుమతి మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ఆచార్య ఇ.ఎ.నారాయణ మీడియా సమావేశంలో ఇక్కడ గురువారం వెల్లడించారు. గత నెలలో యుజిసి నిపుణుల బృందం వర్సిటీని సందర్శించిందని, వివిధ అంశాలను పరిశీలించిందన్నారు.

04/29/2016 - 02:53

విజయవాడ, ఏప్రిల్ 28: భవిష్యత్‌లో కూడా ఏ ఒక్కరూ వేలెత్తి చూపనంతగా తన జీవితాంతం నీతి నిజాయితీతో ఉంటానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తనలో ఏ మాత్రం స్వార్థం లేదని, బలహీనతలు అంతకంటే లేవని, అయితే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే తన బలహీనత అని ఆయన చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ మినహా ఏ ఒక్కరూ మిగలరన్నారు.

04/29/2016 - 02:39

నెల్లూరు/ సూళ్లూరుపేట, ఏప్రిల్ 28: మనకు సొంత దిక్సూచి వచ్చేసింది. మొత్తం ఏడు ఉపగ్రహాల ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ సిరీస్ ప్రయోగ విజయంతో భారత్ మరో అరుదైన ఘనతను సాధించింది. ఇస్రో గురువారం సాధించిన తలమానికమైన విజయం భారత్‌కు సొంత జిపిఎస్ వ్యవస్థ చేకూరేలా చేసింది.

04/29/2016 - 02:36

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశానికి 2016-17 విద్యా సంవత్సరానికి ఒకే ఉమ్మడి ఎంట్రన్స్ పరీక్ష ‘నీట్’ను రెండు దశలుగా నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. దాదాపు ఆరున్నర లక్షల మంది అభ్యర్థులు నీట్ పరీక్షకు హాజరు అవుతారని భావిస్తున్నారు.

04/29/2016 - 02:34

హైదరాబాద్, ఏప్రిల్ 28: సచివాలయానికి వచ్చే సందర్శకులు, ఉద్యోగులు వడ దెబ్బకు గురి కాకుండా ముందు జాగ్రత్త చర్యగా మూడు కౌంటర్లను వైద్య ఆరోగ్యశాఖ గురువారం ప్రారంభించింది. ఈ కేంద్రాలను ఓఆర్‌ఎస్ పాకెట్లను పంచడం ద్వారా సిఎస్ రాజీవ్ శర్మ ప్రారంభించారు.

చిత్రం సచివాలయంలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న సిఎస్ రాజీవ్‌శర్మ

04/29/2016 - 02:32

హైదరాబాద్, ఏప్రిల్ 28:తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రైవేటు విద్యా సంస్థల బెదిరింపులకు లొంగేది లేదని, తనిఖీలను ఆపేది లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ హెచ్చరించారు. మే 1న జరగాల్సిన టెట్, మే 2వ తేదీన జరగాల్సిన ఎంసెట్ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు.

04/29/2016 - 02:30

కాకినాడ/ఏలూరు, ఏప్రిల్ 28: ఉభయ గోదావరి జిల్లా ల్లో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఇద్దరు అధికారులు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) తనిఖీల్లో దొరికిపోయారు. వీరిద్దరూ కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, ఆభరణాలతో అపర కుబేరులుగా వెలిగిపోతున్నట్టు గురువారం జరిపిన తనిఖీల్లో వెల్లడయ్యింది.

04/29/2016 - 02:25

హైదరాబాద్, ఏప్రిల్ 28:ఏళ్ల తరబడి కొరకరాని కొయ్యగా మారిన రాజోలిబండ డైవర్ష్‌న్ స్కీమ్ (ఆర్డిఎస్) సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఆర్డిఎస్ పనులను 50 రోజుల్లో పూర్తి చేస్తామని కర్నాటక ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Pages