-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
విజయవాడ (క్రైం), మే 17: పలు నేరాలకు పాల్పడిన అంతరాష్ట్ర పాత నేరస్థులను సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.54.60లక్షలు విలువ చేసే 1258గ్రాముల బంగారు నగలు, 17.2 కేజీల వెండి నగలు, రూ.9.65లక్షలు నగదు, ల్యాప్టాప్, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు తెలిపారు.
షాద్నగర్, మే 17: ఏసీబీ వలలో అవినీతి చేప చిక్కింది. శుక్రవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుపడ్డాడు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం షాద్నగర్ పురపాలక సంఘం కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న శేఖర్ రెడ్డి..
హైదరాబాద్, మే 17: అఫ్జల్గంజ్ పోలీస్టేషన్ పరిధిలో ఓ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని పలు ప్రాంతాలు చూపిస్తానని చెప్పి ఆమె భర్త దారుణానికి ఒడిగట్టాడు. నమ్మి వెంట వచ్చిన అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను హత్య చేసి పరారయ్యాడు. ఈ సంఘటన అఫ్జల్గంజ్ పొలీస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..
బాలాపూర్, మే 16: ఇంట్లో బట్టలు ఆరేస్తూ తల్లీకూతురు విద్యాదాఘాతానికి గురై దుర్మరణం పాలైన సంఘటన బాలాపూర్ పోలీస్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. బాలాపూర్లోని షాహిన్ నగర్ ప్రాంతంలో ఘటన జరిగింది. సల్లా బేగం తన ఇంట్లో ఉతికిన బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు బట్టలు ఆరేస్తుంది.
హైదరాబాద్, మే 16: హైదరాబాద్ నగరంలో ఓ నకిలీ పోలీసు అధికారిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆర్మీ, ఎన్ఐఏ, ఐపీఎస్ను అంటూ అనేక మోసాలకు పాల్పడిన నకిలీ అధికారి వివరాలను బషీర్బాగ్లోని సిటీ పోలీసు కమిషనరేట్లో జరిగిన విలేఖరుల సమావేశంలో సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. కడప జిల్లాకు చెందిన కార్నాటి గురువినోద్ కుమార్ రెడ్డి(25) నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తాడు.
విజయపురం, మే 16: కన్నబిడ్డకు చిన్నగాయమైతేనే విలవిలలాడే తల్లి ఏకంగా ఇద్దరు బిడ్డలను బావిలోకి తోసి తాను అందులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చిత్తూరు జిల్లా విజయపురం మండలంలోని శ్రీహరిపురం గ్రామంలో జరిగింది. కేవలం తన అత్త, భర్తతో ఏర్పడిన కుటుంబ కలహాలతో వివాహిత ఈ దారుణానికి ఒడిగట్టింది.
జిల్లాలో బుధవారం అర్ధరాత్రి, గురువారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గుడివా డలో వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మరణించగా, జగ్గయ్య పేట సమీపంలోని చిల్లకల్లు ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న ఇద్దరు కార్మికులు అసువులు బాసారు. అలాగే ఈ ప్రమాదాల్లో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
*
విజయవాడ (క్రైం), మే 16: దోపిడీ కేసులో ఇద్దరు నిందితులపై నేరం రుజువుకావడంతో ఒక్కొక్కరికి రెండేళ్లు జైలు, రూ.500ల జరిమానా విధిస్తూ 11వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది.
జీడిమెట్ల, మే 16: వ్యాపారానికి అడ్డువస్తున్నాడనే కక్ష్య అల్లుడిని రాడ్తో దాడి చేసి మామ హత్య చేసిన సంఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. బాచుపల్లి గ్రామం శ్రీవాణి నగర్ జ్యోతి ప్లాంట్లో నివాసముండే ఎండీ జాకీర్ హుస్సేన్ (48) బాచుపల్లి నుంచి మియాపూర్ వెల్లే దారిలో సింఘిల్ టయర్స్ అండ్ మార్బుల్స్ ప్రక్కన పంచర్ దుకాణం నడుపుతుంటాడు. సెకండ్ హాండ్ టయర్స్ను కొనుగోలు చేస్తుంటాడు.
జీడిమెట్ల, మే 16: వాహనాల చోరీ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రూ.8 లక్షలు విలువ చేసే వాహనాలను జీడిమెట్ల పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. గురువారం జీడిమెట్ల పీఎస్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను బాలానగర్ ఏసీపీ గోవర్దన్, సీఐ రమణా రెడ్డి వెల్లడించారు. మెదక్ జిల్లా చిలిప్చేడ్ మండలానికి చెందిన ఆర్.సుధాకర్.. షాపూర్నగర్ రాజీవ్ గాంధీ నగర్లో అద్దెకు నివసిస్తున్నాడు.