-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
గూడూరు, డిసెంబర్ 28: రాష్ట్ర వ్యాప్తంగా పరువు హత్యలు జరుగుతున్న నేపథ్యంలో ఓ కన్నతండ్రి, కూతురు వేరొక కులం యువకుడిని ప్రేమించిందని ఆగ్రహించి శుక్రవారం కత్తితో దాడి చేసిన సంఘటన నెల్లూరు జిల్లా గూడూరు రెండవ పట్టణంలోని నరసింగరావుపేటలో చోటు చేసుకుంది. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు మేరకు కన్నతండ్రిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
ఒంగోలు, డిసెంబర్ 28: ఒంగోలు నగరానికి సమీపంలోని పేర్నమిట్ట వద్దగల శ్రీ ప్రతిభ కాలేజి వద్ద ఆ కాలేజి లో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్న కనుమర్ల రాజారెడ్డి (16) అనే విద్యార్ధి గురువారం అర్ధరాత్రి తరువాత పెట్రోల్ మంటలతో కాలిపోయి అనుమాన స్పద స్థితిలో మృతి చెందారు.
మారేడుమిల్లి, డిసెంబర్ 28: సీనియర్ గిరిజన నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ అటవీశాఖ మంత్రి గొర్లె ప్రకాశరావు (76) అనారోగ్యంతో అమెరికాలో శుక్రవారం మృతిచెందారు. తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం చట్లవాడ గ్రామానికి చెందిన ప్రకాశరావుకు భార్య, ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు పండాదాస్ ఐఏఎస్ అధికారి. ప్రకాశరావు దంపతులు కొంతకాలంగా అమెరికాలో కుమార్తెవద్ద ఉంటున్నారు.
లండన్, డిసెంబర్ 28: లండన్లోని ఐస్లాండ్లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్ సంతతికి చెందిన చెందిన ముగ్గురు మృతి చెందారు. ఏడుగురు కుటుంబ సభ్యులతో వెళ్తున్న ఎస్యూవీ ఐస్లాండ్లో బ్రిడ్జిని ఢీకొని కిందకు పడిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక బాలిక మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్, డిసెంబర్ 27: గుట్టుచప్పుడు కాకుండా నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న హైటెక్ బెట్టింగ్ ముఠాను నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు గుట్టురట్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్.. బషీర్బాగ్లోని పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టాస్క్ఫోర్స్ డీసీపీ పీ.రాధకిషన్ రావుతో కలిసి వెల్లడించారు.
వేములవాడరూరల్,డిసెంబర్ 27: వేములవాడ మండలం సంకెపల్లి గ్రామంలో బుధవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిద్రిస్తున్న పండుగ లచ్చవ్వను (70సం) ఇంట్లోకి ప్రవేశించి ఆమెను బండరాళ్లతో మోది చంపారు. ఈ మేరకు మృతురాలి పెద్దకొడుకు చంద్రయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...
జగిత్యాల, డిసెంబర్ 27: భారతీయులకు ‘ఏకె 47’తో శిక్షణ, సెక్యూరిటీ ఉద్యోగాల పేరుతో రిక్రూట్మెంట్, ట్రావెల్స్ ఏజెన్సీలపై కొరవడిన సీసీఎస్ నిఘా అనే కథనం గురువారం కరీంనగర్ బ్యూరో డేట్లైన్పై ‘ఆంధ్రభూమి’ దినపత్రికలో వచ్చిన వార్తాకు స్పందించిన ఉన్నతాధికారుల ఆదేశాలతో అధికారుల్లో కదలిక వచ్చింది.
జహీరాబాద్, డిసెంబర్ 27: అక్రమంగా అంతర పంటగా సాగుచేస్తున్న రూ.20లక్షల విలువైన గంజాయిని మొక్కలను ఎక్సైజ్ పోలీసులు గురువారం ధ్వంసంచేశారు. నిందితుడు పరారవగా ఆయన ఇంట్లో దొరికిన 12 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
బాన్సువాడ, డిసెంబర్ 27: బాన్సువాడ పట్టణంలోని పాత విద్యుత్ కార్యాలయం వద్ద ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి మలేగావ్ కిషన్రావు(50) అనే వ్యక్తి మృతి చెందాడు. గురువారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, మున్సిపల్ కార్మికులతో మృతదేహాన్ని డ్రైనేజీ నుండి బయటకు తీసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు స్థానిక మిర్చిబండి వద్ద కూలీగా పనిచేసేవాడని స్థానికులు తెలిపారు.
బాన్సువాడ, డిసెంబర్ 27: బాన్సువాడ మండలం చిన్నరాంపూర్ గ్రామ శివారులో గత నాలుగు రోజుల క్రితం బీ.గంగారాం(60) అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన కేసులో స్థానిక పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. గురువారం బాన్సువాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీఎస్పీ యాదగిరి వివరాలను వెల్లడించారు.