S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/05/2016 - 00:39

అమృత్‌సర్, డిసెంబర్ 4: ‘హార్ట్ ఆఫ్ ఏసియా’ సదస్సుకు హాజరయిన సర్తాజ్ అజీజ్ శనివారం రాత్రి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశమైనట్లు సమాచారం. నగ్రోటా ఉగ్రవాద దాడి, కాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ కాల్పులు దృష్ట్యా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయిన నేపథ్యంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

12/04/2016 - 06:01

హార్ట్ ఆఫ్ ఆసియా కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి శనివారం రాత్రి అమృత్‌సర్ వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనితో కలిసి స్వర్ణదేవాలయం సందర్శించారు. ఆలయ భోజన శాలలో స్వయంగా గరిట పట్టుకుని వడ్డించారు. ఆదివారం అమృత్‌సర్‌లో ఈ సదస్సు జరగనుంది. పాకిస్తాన్ నుంచి ఆ దేశ ప్రధాని విదేశాంగ సలహాదారు సర్తాజ్ అజీజ్ పాల్గొంటున్నారు.

12/04/2016 - 03:52

అహమ్మదాబాద్, డిసెంబర్ 3: నల్లధనం స్వచ్ఛంద వెల్లడి పథకంలో రూ.13,860 కోట్లు వెల్లడించిన ప్రాపర్టీ డీలర్ మహేశ్ షా శనివారం నాటకీయ పరిణామాలలో లొంగిపోయారు. ఐటి అధికారులు మహేశ్ షా ఇంటిపై దాడులు చేయటంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీనిపై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావటంతో ఓ గుజరాతీ చానల్ లైవ్ షోలో నేరుగా ప్రత్యక్షమై లొంగిపోయారు.

12/04/2016 - 03:33

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: పొరుగు రాష్టమ్రైన తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఏపీ సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలు కుదురుకునే వరకూ చిన్నచిన్న ఇబ్బందులు ఉండేమాట వాస్తవమేనంటూ, అవేమీ వ్యక్తిగత విభేదాలు కావన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తానెప్పుడూ సిద్ధమేనని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

12/04/2016 - 03:24

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: పెద్ద నోట్ల రద్దు ప్రభావం బడ్జెట్‌పై భారీగా పడినందున కేంద్రం తాత్కాలిక ఆర్థిక వెసులుబాటు కల్పించాలని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరారు. నోట్ల ఇబ్బందుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు చేయాల్సిన సాయంపై ఆరు అంశాలతో కూడిన ప్రతిపాదనలను కేంద్రానికి అందించారు. అరుణ్ జైట్లీ అధ్యక్షతన శనివారం జిఎస్‌టి గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది.

12/04/2016 - 03:17

మొరాదాబాద్, డిసెంబర్ 3: దేశంలో నల్లకుబేరులకు ఎక్కడికక్కడ ముకుతాడు వేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. తాజాగా మరో షాక్ ఇచ్చారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో తమ దగ్గర ఉన్న నల్లధనాన్ని తెలుపుగా మార్చుకునేందుకు తెలివిగా జన్‌ధన్ ఖాతాలలో పెద్ద ఎత్తున జమ చేసుకున్న వారికి తల బొప్పికట్టించే నిర్ణయాన్ని మోదీ శనివారం ప్రకటించారు.

12/04/2016 - 03:08

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఆంధ్రప్రదేశ్‌లో పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావలసిందిగా పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఆయన శనివారం ఢిల్లీలో హిందూస్తాన్ టైమ్స్ ఏర్పాటు చేసిన నాయకత్వ సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించేందుకు అవసరమైన అన్ని వనరులు, ఖనిజాలు ఉన్నాయి, స్నేహపూర్వక ప్రభుత్వం ఉన్నదని చంద్రబాబు చెప్పారు.

12/04/2016 - 00:47

ముంబయి, డిసెంబర్ 3: పెద్ద నోట్లను రద్దు చేసి మూడు వారాలకు పైగా అయినా మార్కెట్‌లో కరెన్సీ కొరత తీరడం లేదు. ఇప్పటికీ పెద్దసంఖ్యలో ప్రజలు బ్యాంకులు, ఎటిఎం కేంద్రాల ముందు నగదుకోసం బారులు తీరుతున్నారు. ముంబయిలో శనివారం వారాంతపు ఖర్చులకోసం ప్రజలు నానాఅవస్థలు పడ్డారు. గంటల తరబడి క్యూలో నిలబడుతున్నప్పటికీ బ్యాంకులు అంతంత మాత్రంగానే డబ్బులిస్తున్నాయి. ఉన్న నగదు అయిపోగానే ఆపేస్తున్నాయి.

12/04/2016 - 00:44

మొరాదాబాద్, డిసెంబర్ 3: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో శనివారం జరిగిన బిజెపి పరివర్తన్ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ కాలంతోపాటుగా మనమూ మారాల్సిన అవసరం ఉందని, డిజిటల్ లావాదేవీలకు మళ్లక తప్పదని, ఓ బిచ్చగాడు స్వైపింగ్ మిషన్‌ను ఉపయోగిస్తున్నట్లుగా వాట్సాప్‌లో వచ్చిన ఓ వీడియోను ప్రస్తావించారు. ‘అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు.. అయితే వాట్సాప్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది.

12/04/2016 - 00:42

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: వయసు మీద పడుతున్న కొద్దీ ఎవరికైనా అలుపన్నది సహజం. అయితే 74 ఏళ్ల వయసులో కూడా అమితాబ్ బచ్చన్‌లో అలాంటిదేమీ కనిపించదు. ఆయన ఇప్పటికీ సినిమాలు, రకరకాల కార్యక్రమాలతో ప్రతి రోజూ బిజీగా గడపడమే కాదు, హ్యూమర్ కూడా ఏమాత్రం తగ్గలేదు. ఎదుటి వాళ్లు అడిగే ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానం చెప్పడమే కాదు, అందులో హాస్యం కూడా తొణికిసలాడుతూ ఉంటుంది.

Pages