S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/16/2016 - 07:27

బాగ్దాద్, అక్టోబర్ 15: ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి బాంబులతో మోతతో భీతిల్లిపోయింది. మొహమ్మద్ ప్రవక్త మనుమడు హుస్సేన్‌కు నివాళులర్పించేందుకు, అలాగే మరణించిన ఒక వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సమావేశమైన షియాలను టార్గెట్ చేసుకుని అత్యంత జమ సమ్మర్థం కలిగిన ప్రాంతంలో ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకోవడంతో ఆ ప్రాంతమంతా భీతిల్లిపోయింది.

10/16/2016 - 07:25

చెన్నై, అక్టోబర్ 15: దేశంలో న్యాయ వ్యవస్థ అద్భుతంగా పని చేస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ అన్నారు. కేసులు పెరగడం వల్ల భారీ సంఖ్యలో పెండింగ్‌లో ఉంటున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి జడ్జీల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. దేశంలో సగటున హైకోర్టు స్థాయిలో ప్రతి జడ్జికి 650 కేసులుంటున్నాయి.. భారత దేశంలో న్యాయ వ్యవస్థ పని తీరు అద్భుతంగా ఉంటోంది.

10/16/2016 - 07:24

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: భారత్‌కు చిత్తశుద్ధి ఉంటే కాశ్మీర్ సమస్యను చర్చలద్వారా పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ చేసిన ప్రతిపాదనను విదేశీ వ్యవహారాల శాఖ కొట్టివేసింది. షరీఫ్ శనివారం ఉదయం అజర్‌బైజాన్‌లోని బకు పట్టణంలో పాకిస్తానీ జర్నలిస్టులకు ఇచ్చిన అల్పాహార విందు సందర్భంగా ఈ ప్రతిపాదన చేశారు. నవాజ్ షరీఫ్ మూడు రోజుల పర్యటనకోసం అజర్‌బైజాన్ వచ్చారు.

10/16/2016 - 07:24

ముంబయి, అక్టోబర్ 15: నేతాజీ సుభాశ్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్‌లో సైనికుడిగా పనిచేసిన డానియెల్ కాలే కన్నుమూశారు. కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్న 95 ఏళ్ల కాలే మహారాష్టల్రోని కొల్హాపూర్‌లో మృతి చెందారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరిన కాలే శుక్రవారం ఉదయం 8 గంటలకు తుది శ్వాస విడిచారు. పౌరుల సంక్షేమంకోసం పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థ ‘వైట్ ఆర్మీ’ వ్యవస్థాపకుడు అశోక్ రొకాడే..

10/16/2016 - 07:23

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: మనీ లాండరింగ్ కేసులో దుబాయ్‌కి చెందిన వివాదాస్పద మాంసం ఎగుమతిదారుడు మొయిన్ ఖురేషీని అధికారులు శనివారం న్యూఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఖురేషీకి వ్యతిరేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ (ఎల్‌ఓసి) ఆధారంగా అధికారులు ఆయనను అరెస్టు చేశారు.

10/16/2016 - 07:23

షిరిడి, అక్టోబర్ 15: షిరిడిలోని సాయిబాబాకు ఇటీవల నాలుగు రోజులపాటు సాగిన దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులు రూ. 4కోట్లకు పైగా విరాళాలను అందజేశారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10 నుంచి 13వ తేదీ వరకు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు (ఎస్‌ఎస్‌ఎస్‌టి)కు చెందిన వివిధ హుండీలు, నగదు కౌంటర్లు, ఆన్‌లైన్ కౌంటర్ల ద్వారా ఆలయానికి రూ.4.43 కోట్ల ఆదాయం సమకూరినట్లు ట్రస్టు ఆఫీస్ బేరర్లు తెలిపారు.

10/16/2016 - 07:22

ఇస్లామాబాద్, అక్టోబర్ 15: పాకిస్తాన్‌తో ఉన్న సరిహద్దులను 2018 డిసెంబర్ నాటికి పూర్తిగా మూసివేయాలన్న భారత్ చర్య ఇరుగు పొరుగు దేశాలతో శాంతియుత సంబంధాలను కోరుకుంటున్నట్టు ఆ దేశం చేసిన వాదనకు విరుద్ధంగా ఉందని పాకిస్తాన్ పేర్కొంది.

10/16/2016 - 06:18

బెనౌలిమ్ (గోవా), అక్టోబర్ 15: భారత్, రష్యాలు శనివారం రక్షణ రంగానికి సంబంధించి పలు కీలక ఒప్పందాలను కుదుర్చున్నాయి. గోవాలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో శనివారం ఉదయం చర్చలు జరిపిన అనంతరం ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ప్రధానంగా రక్షణ, ఇంధన రంగాలకు సంబంధించిన ఒప్పందాలకు ఇరు దేశాలు పెద్ద పీట వేశాయి.

10/16/2016 - 06:16

చందౌలి , అక్టోబర్ 15: ఉత్తరప్రదేశ్‌లో వారణాసిలో శనివారం అపశ్రుతి చోటుచేసుకుంది. బాబా జై గురుదేవ్ సభలో జరిగిన తొక్కిసలాటలో 24 మంది మృతి చెందారు. సభకు వేలాది మంది తరలిరావడంతో వారణాసి, చందౌలి మధ్య రాజ్‌ఘాట్ వంతెనపై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. జై గురుదేవ్ సభకు ఒక్కసారిగా భక్తులు ఎగబడ్డారు.

10/16/2016 - 04:56

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: భారత దేశ సుసంపన్నమైన నాగరికత అభివృద్ధికి మూలకారకమైన సరస్వతీ నది అస్తిత్వం తిరుగులేనిదని మరోసారి స్పష్టమైంది. వేల ఏళ్లనాటి ఈ దేశ నాగరికత సరస్వతీనదీ పరీవాహక ప్రాంతంలో విలసిల్లినది ముమ్మాటికీ వాస్తవమని తేలిపోయింది. కుత్సితపు ప్రచారాలకు, కుటిల వక్రీకరణలకు ఇప్పుడిక కాలం చెల్లింది. భారత సంస్కృతి, చరిత్రలకు మసిపూసి మారేడుకాయ చేయటం సాధ్యం కాదని స్పష్టమైంది.

Pages