S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/03/2016 - 18:11

దిల్లీ: దేశద్రోహం కేసులో అరెస్టయి తిహార్ జైలులో ఉన్న జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్‌కు దిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో అతను ఏ క్షణంలోనైనా విడుదలయ్యే అవకాశం ఉన్నందున పోలీసులు అప్రమత్తమయ్యారు. దిల్లీలోని జంతర్ మంతర్, జెఎన్‌యు, దిల్లీ యూనివర్సిటీ ప్రాంతాల్లో జరిగే ఆందోళనల్లో కన్నయ్య పాల్గొనే అవకాశం ఉందని పోలీసులు పలు ప్రాంతాల్లో భద్రతను ముమ్మరం చేశారు.

03/03/2016 - 18:09

దిల్లీ: దేశద్రోహం కేసులో అరెస్టయిన జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్ ఇటీవల అఫ్జల్‌గురు జయంతి సందర్భంగా దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి నినాదాలు చేయలేదని దిల్లీ ప్రభుత్వం నిర్వహించిన న్యాయ విచారణలో తేలింది.

03/03/2016 - 16:28

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలోని అటవీ ప్రాంతంలో గురువారం మావోయిస్టులు, పోలీసులకు మధ్య మళ్లీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో రాజీవర్ అనే ఎస్‌ఐ గాయపడగా, వైద్య చికిత్స కోసం వెంటనే హెలికాప్టర్‌లో రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు.

03/03/2016 - 16:24

కోల్‌కత: ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సీనియర్ నాయకుడు అశోక్ ఘోష్ (94) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ స్ఫూర్తితో ఆయన ఫార్వర్డ్ బ్లాక్‌లో చేరి స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. వామపక్ష నేతగా జాతీయ స్థాయిలో విశేష సేవలందించిన ఘోష్ మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

03/03/2016 - 14:25

దిల్లీ: ఖలిస్తాన్ ఉగ్రవాది బింద్రన్‌వాలే జయంతి సందర్భంగా గత నెల 12న లూధియానా (పంజాబ్)లో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సంజయ్ సింగ్, భగవత్ మాన్‌లు కరపత్రాలు పంచారని, దీన్ని దేశద్రోహంగా పరిగణించాలని ఓ కేసు నమోదైంది.

03/03/2016 - 14:24

దిల్లీ: దివంగత మాజీ ప్రధాని, తన తండ్రి రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేసే విషయంలో కేంద్రానిదే తుది నిర్ణయమని, ఈ అంశంపై తానేమీ మాట్లాడలేనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ అన్నారు. రాజీవ్ హంతకులు పాతికేళ్లుగా జైలులో ఉన్నందున వారిని విడుదల చేసే విషయంలో తుది నిర్ణయం చెప్పాలంటూ తమిళనాడు హోం శాఖ కార్యదర్శి కేంద్ర హోం శాఖకు తాజాగా లేఖ రాసిన సంగతి తెలిసిందే.

03/03/2016 - 11:59

దిల్లీ: ఏ.పి. పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈ రోజు ఉదయం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన చట్టంలో హామీలు, ఎ.పి.కి నిధుల కేటాయింపు, తాజా రాజకీయ పరిణామాలు వంటి అంశాలపై రఘువీరా రాహుల్‌తో చర్చించారు.

03/03/2016 - 11:58

శ్రీనగర్: పుల్వామా జిల్లాలో గురువారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల సంఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. డాడ్సారా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానించిన భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకోగా, కాల్పులు ప్రారంభమయ్యాయి. ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు మరణించారని, భద్రతా సిబ్బంది తెలిపారు.

03/03/2016 - 11:58

దిల్లీ: వివిధ బ్యాంకులకు సుమారు 7వేల కోట్ల రూపాయల మేరకు మోసం చేసిన కింగ్‌ఫిషర్ సంస్థపై సిబిఐ కేసు నమోదు చేసింది. రుణాలకు సంబంధించి వివరాలను ఇవ్వాల్సిందిగా బ్యాంకులను పలుసార్లు కోరినా ఫిర్యాదు ఇవ్వకపోవటంతో తమంతట తామే కేసు నమోదు చేశామని సిబిఐ డైరెక్టర్ తెలిపారు.

03/03/2016 - 11:56

దిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. రాజ్యసభలోనూ ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు మాట్లాడుతున్నారు.

Pages