డిజిటల్కు మారదాం
Published Friday, 9 December 2016న్యూఢిల్లీ, డిసెంబర్ 8:దేశ ప్రజలు డిజిటల్ విధానంలో ఆర్థిక లావాదేవీలు సాగించేందుకు అవసరమైన వ్యవస్థను రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. నగదు రహిత లావాదేవీలపై ఏర్పాటైన కమిటీ సమావేశానికి ఆయన గురువారం అధ్యక్షత వహించారు. ఆర్బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పనగరియా, వివిధ బ్యాంకుల సిఎండీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం ముగిశాక ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశ ప్రజల ఆర్థిక లావాదేవీలు చాలావరకు డిజిటల్ పద్ధతిలో జరిగేందుకు అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు.