మీకు అనుమతి ఇచ్చిందెవరు?
Published Friday, 9 December 2016కొత్తపేట, డిసెంబర్ 8: కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండుతో సత్యాగ్రహ పాదయాత్ర చేయాలని భావిస్తున్న తనను అనుమతి తీసుకోవాలని చెబుతున్న ముఖ్యమంత్రి గతంలో ఆయన విపక్ష నేతగా జరిపిన పాదయాత్రకు ఎవరి నుండి అనుమతి తీసుకున్నారో చెప్పాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కోరారు. ఆ అనుమతి పత్రాలు తనకు చూపితే, తాను అదేరీతిలో అనుమతి కోరతానన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలో గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. నాడు చంద్రబాబు రోడ్డు మార్జిన్లపై మళ్లీ రోడ్డు వేసుకుని పాదయాత్ర సాగించారని, ఇలా వేసుకోవడానికి ఎవరి అనుమతి కోరారో తెలపాలన్నారు.