మరో 50 వేల మందికి రూ. 5 భోజనం
Published Friday, 9 December 2016హైదరాబాద్, డిసెంబర్ 8: మహానగరంలో అర్దాకలితో అలమటించే వారికి మధ్యాహ్నం పూట పెట్టడన్నం పెట్టాలన్న మహాసంకల్పంతో జిహెచ్ఎంసి ప్రస్తుతం అమలు చేస్తున్న రూ. 5 భోజన పథకాన్ని మున్ముందు మరింత విస్తరించనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. బోరబండలో కొత్తగా ఏర్పాటు చేసిన రూ. 5 భోజనం పంపిణీ కేంద్రాన్ని డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రూ. 30 కోట్లతో మరో 50వేల మందికి ఈ భోజనాన్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. అంతేగాక, ప్రస్తుతం నగరంలో ఉన్న ఈ భోజన పంపిణీ కేంద్రాల సంఖ్యను 150కు పెంచనున్నట్లు మేయర్ తెలిపారు. రూ.