S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గణితం అంటే ఆలోచనా పద్ధతి

గణితం అన్ని సబ్జెక్టుల కన్నా ఉత్తమమైనటువంటి ప్రక్రియకు మూలం అంటారు. గణితం మనం ఏ విధంగా క్రమబద్ధంగా ఆలోచించాలో చెబుతుంది. ఈనాడు గణాతాన్ని సమస్యా పరిష్కారానికి వేదిక అంటున్నారు. గతంలో కన్నా ఇప్పటికి తేడా ఏమిటంటే? గతంలో గణితాన్ని ఎక్స్‌ర్‌సైజ్ కోసం ఉపయోగించారు. సమస్యను ఎలా పరిష్కరించాలో నియమితమై ఉంటుంది. ఆలోచనలో కలిసిన సమస్యా పరిష్కారం వల్లనే ఈనాడు సమస్యలకు విరుగుళ్లు దొరుకుతాయి. ఈనాడు దీన్ని కాల్పనికమైన సమస్యా పరిష్కారం అంటున్నారు. అంటే ఆలోచన కలిసిన సమస్యా పరిష్కార విధానం కాబట్టి విద్యార్థి తనదైన కొత్త ఆలోచనలు చేయటం జరుగుతుంది.

- చుక్కా రామయ్య

విమానంలో విందు.. విందులో బొద్దింక!

తెలుగులో మాట్లాడితే చెడ్డపేరు వచ్చేస్తుందన్న భయం దాదాపు అందరి ముఖాల మీద తాండవిస్తున్న అనుభూతి కలిగింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఢిల్లీకి ఎగరబోతున్న ఆ ప్రభుత్వేతర రంగపు గగన శకటంలో ఒక రోజున దృశ్యమానమైన విచిత్రం ఇది. ఒక రోజున ఏమిటి? ప్రతిరోజూ ఇదే దృశ్యం మన దేశపు అన్ని విమానాలలోను, విమానాశ్రయాలలోను పునరావృత్తం అవుతుండడం ‘వాణిజ్య ప్రపంచీకరణ ప్రభావం’! ‘ఎయిర్ ఇండియా’ ఒక్కటే ప్రభుత్వరంగ సంస్థ. ఎయిర్ ఇండియా వారి విమానంలోని శాకాహారపు విందు భోజనంలో ‘కాక్రోచ్’ బయట పడిందని నవంబర్ పదహారవ తేదీన ధ్రువపడిన తరువాత ఈ భయం మరీ ఎక్కువైందట! ‘ఈ భయం’ అని అంటే..

-హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 99510 38352

పాకిస్తాన్‌కు శృంగభంగం

పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకాండను అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వం అంతర్జాతీయ వేదికపై అభిశంసించడం మన దేశానికి లభించిన వ్యూహాత్మక విజయం. అమృతసర్‌లో ఆదివారం జరిగిన ‘అఫ్ఘానిస్థాన్ సంబంధ ఆసియా సదస్సు’- హార్ట్ ఆఫ్ ఆసియా- హెచ్‌ఓఏ- కాన్ఫరెన్స్-లో పాకిస్తానీ లష్కర్ ఏ తయ్యబా- ఎల్‌ఇటి-, జాయిష్ ఏ ముహమ్మద్- జెఇఎమ్-లను అభిశంసిస్తూ తీర్మానించడంతో ఈ విజయం ప్రస్ఫుటించింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఉసికొల్పుతున్న సీమాంతర ఉగ్రవాదం అటు అఫ్ఘానిస్థాన్‌కు ఇటు మన దేశానికి ప్రమాదకరంగా పరిణమించడం ఈ సదస్సుకు నేపథ్యం.

పునరుత్పత్తి విజ్ఞానాన్ని రైతులకు అందించాలి

తిరుపతి, డిసెంబర్ 6: సాంకేతిక పునరుత్పత్తి విభాగం ఎంతో అభివృద్ధి చెందుతున్నదని, ఆధునిక పరిజ్ఞానంతో కూడుకున్న విజ్ఞానాన్ని రైతులకు అందించాలని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ విసి మన్మోహన్‌సింగ్ పిలుపునిచ్చారు. మంగళవారం విశ్వవిద్యాలయంలో పశుపునరుత్పత్తి విభాగంలో పశుపునరుత్పత్తి-సాంకేతిక పద్ధతులతో పునరుత్పత్తి పెంపొందించడం అనే అంశంపై మూడురోజుల సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ మనోహ్మన్‌సింగ్ మాట్లాడుతూ ఆధునిక పరిజ్ఞానంతో కూడుకున్న విజ్ఞానాన్ని పాడి రైతులకు అందించేందుకు దృష్టి సారించాలన్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సత్యాత్మాతీర్థ స్వామి

తిరుపతి, డిసెంబర్ 6: కర్ణాటకలోని ఉత్తరాది మఠం పీఠాధిపతి సత్యాత్మతీర్థ స్వామివారు మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న స్వామివారికి టిటిడి ఇఓ డి సాంబశివరావు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం సత్యాత్మతీర్థ స్వామివారు మాట్లాడుతూ ధర్మ ప్రచారంలో టిటిడి ముందు ఉందన్నారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఇఓ కోదండరామారావు, పేష్కార్ సెల్వం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

నగదు రహిత లావాదేవీలపై అవగాహన ర్యాలీ

తిరుపతి, డిసెంబర్ 6 : నగదురహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు మంగళవారం ఎస్వీయూ విసి ఆచార్య దామోదరం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలతో సమాజంలో అవినీతిని తగ్గించవచ్చని అన్నారు. ఇంటి వద్దే చరవాణిలో ఆర్థిక లావాదేవీలు జరిపి సమయాన్ని ఆదా చేయవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఎస్వీయూ ఐదు గ్రామాలను దత్తత తీసుకుని ప్రజల్లో చైతన్యం కల్పిస్తామన్నారు. ఎస్వీయూ అనుబంధ కళాశాలలు కూడా ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు.

సర్వదర్శనం కాంప్లెక్స్‌కు నిర్మాణస్థల పరిశీలన

తిరుపతి, డిసెంబర్ 6: తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో సర్వదర్శనం కాంప్లెక్స్ నిర్మాణం కోసం రెండు ప్రాంతాల్లో స్థలాలను మంగళవారం టిటిడి ఇఓ డాక్టర్ డి సాంబశివరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ అధికారులు రూపొందించిన ప్లాన్‌ను ఇఓ పరిశీలించి పలు సూచనలు చేశారు. పర్వదినాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. నిపుణులను సంప్రదించి మరింత మెరుగ్గా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తరువాత దివ్యదర్శనం కాంప్లెక్స్‌ను ఇఓ పరిశీలించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.

ధనార్జన కన్నా నైతిక విలువలకు అధిక ప్రాధాన్యత

తిరుపతి, డిసెంబర్ 6: ధనార్జన కన్నా నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సమసమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, తద్వారా దేశాభివృద్ధి పురోగతి సాధిస్తుందని కెనరాబ్యాంక్ చైర్మన్, పద్మశ్రీ ఎన్ మనోహరన్ అన్నారు. ది సౌత్ ఇండియన్ రీజనల్ కౌన్సిల్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఆర్‌సి) 48వ రీజనల్ కాన్ఫరెన్స్ మంగళవారం స్థానిక ఎస్వీవెటర్నీ క్రీడా మైదానంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ రెండు నిమిషాలు వౌనం పాటించారు.

జిల్లా తమిళుల్లో విషాద ఛాయలు

చిత్తూరు, డిసెంబర్ 6: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంతో జిల్లా తమిళుల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. జయలలిత ఆరోగ్యం కుదుటపడుతుందని భావిస్తున్న తరుణంలో ఆమె మృత్యువాత పడడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. మంగళవారం కూడా జిల్లా నుంచి తమిళనాడుకు వెళ్లే బస్సులు దాదాపుగా నిలిచి పోయాయి. జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల జయలలిత చిత్రపటాలను ఉంచి ఘనంగా నివాళులర్పించారు. పలు రాజకీయ పార్టీల నేతలు, అభిమానులు, పలు ప్రజాసంఘాలు కార్మిక ఉద్యోగ సంఘాలు ఆమె చిత్రపటాలకు పూల మాలలువేసి శ్రద్ధాంజలి ఘటించారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులో అన్నాడిఎంకె పార్టీ కార్యాలయం వద్ద విషాదఛాయలు నెలకొన్నాయి.

రాష్ట్రంలోని అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో దశలవారీగా స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు

ఒంగోలు, డిసెంబర్ 6 : రాష్ట్రంలోని అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో దశల వారీగా స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. మంగళవారం ఒంగోలులోని రవాణా శాఖ అధికారి కార్యాలయంలో క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా వాహన యజమానులు ఫీజులు, టాక్సులు చెల్లించేందుకు స్వైపింగ్ మిషన్ల ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రవాణా శాఖలో డ్రైవింగ్ లైసెన్సును ఆధార్‌కార్డుతో అనుసంధానం ప్రక్రియ 94 శాతం పూర్తి చేశామన్నారు. రాష్ట్రంలో రవాణా శాఖలో అనేక సంస్కరణలు చేపట్టామన్నారు.

Pages