ఇంకో 20 రోజులు.. ఇదే స్ఫూర్తి
Published Thursday, 8 December 2016విజయవాడ, డిసెంబర్ 7: డిసెంబర్ నెల మొదటివారం విజయవంతంగా ముగించాం, మిగిలిన 20 రోజులు ఇదే స్ఫూర్తితో పని చేసి డిమానిటైజేషన్ సమస్యను అధిగమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. బ్యాంకర్లు, ఆర్థికశాఖ అధికారులతో ఆయన బుధవారం తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డిమానిటైజేషన్ ప్రారంభమై ఇప్పటికి నెల రోజులు అయ్యిందంటూ నగదు రహితంగా రాష్ట్రాన్ని మార్చడంలో ఉత్తీర్ణులు అయ్యామన్నారు. భౌతిక నగదు వినియోగం తగ్గించి, డిజిటల్ నగదు వాడకం పెంచడమే ప్రస్తుత సమస్యకు పరిష్కారంగా మరోసారి గుర్త చేశారు. వచ్చే నెలలో ఈ సమస్య ప్రభావం పూర్తిగా అధిగమిస్తామనే విశ్వాసం ప్రకటించారు.