ఓడిఎఫ్పై టాస్క్ఫోర్స్
Published Wednesday, 7 December 2016విశాఖపట్నం, డిసెంబర్ 6: బహిరంగ మల విసర్జన రహితం (ఓడిఎఫ్)గా తీర్చిదిద్దే క్రమంలో ఎక్కడైనా అతిక్రమణ జరిగితే కఠిన జరిమానాలకు వెనుకాడ వద్దని కలెక్టర్ ప్రవీణ్కుమార్ ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా జిల్ల స్థాయి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కమిటీ సమావేశం మంగళవారం కలెక్టరేట్లో జరిగింది. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ బహిరంగ మల విసర్జన నియంత్రించేందుకు టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలన్నారు. టాస్క్ఫోర్స్ నిరంతరం రహదార్లను సందర్శించి బహిరంగ మల విసర్జన జరిగితే, అందుకు బాధ్యులపై భారీ జరిమానాలు విధించాలని సూచించారు.