మీడియాపై ఆంక్షలు
Published Friday, 10 June 2016ప్రత్తిపాడు, జూన్ 9: కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కిర్లంపూడిలో చేపట్టిన ఆమరణ దీక్షకు సంబంధించిన సమాచారం సేకరణకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై పోలీసులు ఆంక్షలు విధించారు. దీక్షను మొదలుపెట్టే సమయంలో మీడియాతో ముద్రగడ మాట్లాడుచున్నారని, లోపలికి వెళ్ళాలని చెప్పినప్పటికీ పోలీసులు అనుమతించలేదన్నారు. ముద్రగడ ఇంటి ముందు పోలీసులు ఏర్పాటు చేసిన మీడియా పాయింట్లో కూర్చోవాలని సెలవిచ్చారు. అప్పటికే కొంతమంది ముద్రగడ నివాసంలోకి వెళ్లడంతో కొంతమందిని పంపించి, మరికొంతమందిని నిలువరించడంపై మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి, రాస్తారోకోకు దిగారు.