జగన్ దూకుడుకు కళ్లెం!
Published Friday, 10 June 2016కడప, జూన్ 9:వైకాపా ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లాలో వైకాపా ప్రాధాన్యతను పూర్తిస్థాయిలో తగ్గించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తనయుడు, జాతీయ ప్రధానకార్యదర్శి ఎన్.లోకేష్బాబులు రెండురోజులపాటు జిల్లాలో మకాం వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారయంత్రాంగంపై తెలుగుదేశం మార్క్ వేసుకోవడానికి శాఖ ల వారీగా అధికారులతో సమీక్షించా రు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హ యాంలో పనిచేసిన అధికారులు ప్రస్తుతం టిడిపి ప్రభుత్వంలో ఏ విధ ంగా వ్యవహరిస్తున్నారోనని వారి వ్యవహారశైలిపై బాబు గమనిస్తున్నట్లు తె లుస్తోంది.