కన్నుల పండువగా శ్రీ సువర్చలా సమేత ఆంజనేయస్వామి కళ్యాణం
Published Friday, 10 June 2016తెనాలి, జూన్ 9: స్థానిక షరాఫ్ బజార్లో వేంచేసియున్న శ్రీ సువర్చలా సమేత పంచముఖ ఆంజనేయస్వామి కళ్యాణం గురువారం కన్నుల పండువగా నిర్వహించారు. అష్టమ వార్షికోత్సవాలు, శ్రీ హనుమజ్జయంతి ఉత్సవాలలో భాగంగా స్వామికి ప్రత్యేక పూజల అనంతరం భక్తుల భజనలు, సంకీర్తనల మధ్య కళ్యాణ ఘట్టాన్ని ఆలయ ప్రధాన అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వైభవంగా చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్ వెంకట్రావు, ఎస్బి శివ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. శ్రీ హనుమత్ సేవా సమితి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తనా బృదం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రామనామ జపం, ఆంజనేయ కీర్తనలు భక్తులను అలరించాయి.