S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నుల పండువగా శ్రీ సువర్చలా సమేత ఆంజనేయస్వామి కళ్యాణం

తెనాలి, జూన్ 9: స్థానిక షరాఫ్ బజార్‌లో వేంచేసియున్న శ్రీ సువర్చలా సమేత పంచముఖ ఆంజనేయస్వామి కళ్యాణం గురువారం కన్నుల పండువగా నిర్వహించారు. అష్టమ వార్షికోత్సవాలు, శ్రీ హనుమజ్జయంతి ఉత్సవాలలో భాగంగా స్వామికి ప్రత్యేక పూజల అనంతరం భక్తుల భజనలు, సంకీర్తనల మధ్య కళ్యాణ ఘట్టాన్ని ఆలయ ప్రధాన అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వైభవంగా చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్ వెంకట్రావు, ఎస్‌బి శివ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. శ్రీ హనుమత్ సేవా సమితి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తనా బృదం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రామనామ జపం, ఆంజనేయ కీర్తనలు భక్తులను అలరించాయి.

సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం

గుంటూరు (పట్నంబజారు), జూన్ 9: దేశ, సమాజాభివృద్ధిలో మహిళలు కీలకభూమిక పోషించకుంటే ఆ సమాజం పురోగమించదని జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక రైలుపేటలోని శ్రీ సత్యసాయి విద్యానికేతన్‌లో సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర అనే అంశంపై జరిగిన సదస్సుకు విద్యానికేతన్ ప్రిన్సిపాల్ ఎస్ కృష్ణకుమారి అధ్యక్షత వహించారు. ముఖ్యవక్తగా హాజరైన జెడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్ మాట్లాడుతూ సనాతన భారతీయ ధర్మంలో స్ర్తిలకు మహోన్నతమైన పాత్ర ఉందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలోనూ మహిళల పాత్ర ఎనలేనిదన్నారు. నేటి ఆధునిక యుగంలో కూడా మహిళలు బహుముఖీయ పాత్ర పోషిస్తూ తమ ఆధిపత్యాన్ని చాటుతున్నారన్నారు.

మంగళగిరి కొండపైకి రోప్‌వేకు సర్వే

మంగళగిరి, జూన్ 9: కొండపైకి పర్యాటకులను ఆకర్షించే విధంగా రోప్‌వే ఏర్పాటుకు గురువారం కోల్‌కతాకు చెందిన కంపెనీ ప్రతినిధి ప్రాథమిక సర్వే జరిపారు. ఆలయ ఇఓ మండెపూడి పానకాలరావు, ధర్మకర్తలు కోసూరు శివనాగరాజు, ఆలేటి నాగలక్ష్మి, ఎవి సాంబశివరావు, ఉపప్రధాన అర్చకుడు నల్లూరి రామచంద్ర భట్టాచార్యులు, చేనేత బోర్డు సభ్యుడు జగ్గారపు శ్రీనివాస్‌తో కలిసి కొండ ప్రాంతాన్ని పరిశీలించారు. కిందినుంచి సుమారు 800 అడుగులకు పైగా ఉన్న కొండ శిఖర భాగానికి రోప్‌వే ఏర్పాటుకు సుమారు 15 కోట్ల రూపాయల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని, రోప్‌వే సర్వీసెస్ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ తన్మయి కుమార్ దేవ్ వెల్లడించారు.

నామినేటెడ్ భర్తీలో ఏపీదే ముందంజ

గుంటూరు, జూన్ 9: తెలంగాణ ప్రభుత్వం కన్నా ఆంధ్రప్రదేశ్‌లోనే అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ పాలకవర్గ నియామకాలతో పాటు నామినేటడ్ పదవులను ఎక్కువగా భర్తీచేశామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. గురువారం రాత్రి పొద్దుపోయాక రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియాతో పిచ్చాపాటిగా రెండు నిముషాలు మాట్లాడారు. గుంటూరు మిర్చియార్డు పదవులకు ఎక్కువ మంది పార్టీ నుండి తలపడుతున్నందున ఎటువంటి విభేదాలు తలెత్తకుండా అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో, ఏకాభిప్రాయంతో నియామకాలు జరుపుతామన్నారు.

త్వరితగతిన పుష్కర పనులు పూర్తి

గుంటూరు, జూన్ 9: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని జిల్లాలో చేపట్టిన పుష్కర పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో పుష్కర పనుల పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ ఇరిగేషన్, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, దేవాదాయ, పురపాలక, టూరిజం శాఖల అధికారులో ఆయా శాఖల వారీగా పనుల పురోగతిపై సమీక్షించి పలు సూచనలు జారీ చేశారు.

అమ్మకాల ఒత్తిడిలో మార్కెట్లు

ముంబయి, జూన్ 9: పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు(ఐఐపి) వెలువడనున్న నేపథ్యంలో మదుపరులు ఇటీవల అంచనాలకు మించి లాభాలు ఆర్జించిన కంపెనీల స్టాక్స్‌లో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు దిగడంతో గత రెండు రోజులుగా లాభాల బాటలో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం తిరిగి నష్టాల్లో ముగిశాయి. వచ్చే వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం జరగనున్న నేపథ్యంలో మదుపరులు తమ వద్ద ఉన్న స్టాక్స్‌ను వదిలించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని బ్రోకర్లు అంటున్నారు.

చార్జీలను కట్టడి చేయం

న్యూఢిల్లీ, జూన్ 9: ప్రైవేటు విమానయాన సంస్థలు చార్జీలను ఏకపక్షంగా పెంచేస్తున్నాయంటూ ప్రయాణికులనుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో విమాన చార్జీలను కట్టడి చేసే యోచచన లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా చేసినట్లయితే ప్రైవేటు విమాన సంస్థల మధ్య పోటీ ఉండదని కూడా వాదిస్తోంది. విమాన చార్జీలపై పరిమితి విధించడం మంచి వ్యాపార ఆలోచన కాదని, ఎందుకంటే దీనివల్ల చిన్న పట్టణాలకు కూడా విమాన సదుపాయం కల్పించాలన్న ప్రభుత్వ ఆలోచన దెబ్బతింటుందని, ఎందుకంటే లాభదాయకం కాని రూట్లలో విమానాలు నడపడానికి విమానయాన సంస్థలు ముందు రావని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు అభిప్రాయ పడ్డారు.

మరిన్ని సహారా ఆస్తుల వేలానికి సెబీ రెడీ

న్యూఢిల్లీ, జూన్ 9: చెల్లింపుల సంక్షోభంలో కూరుకుపోయిన సహారా ఇండియానుంచి తమకు రావలసిన సొమ్మును రాబట్టడానికి ఇప్పటికే ఆ సంస్థకు చెందిన సుమారు 1200 కోట్ల రూపాయల విలువైన భూములను అమ్మకానికి పెట్టిన సెబి మరో రూ. 1900 కోట్ల విలువైన 16 ఆస్తులను వచ్చేనెల అమ్మకానికి సిద్ధం చేసింది. దీంతో ఇప్పటివరకు అమ్మకానికి పెట్టిన సహారా ఆస్తుల విలువ 3,100 కోట్లకు చేరుకుంది. అంతే విలువ కలిగిన మరిన్ని ఆస్తులను కూడా రాబోయే రోజుల్లో అమ్మకానికి పెట్టవచ్చని తెలుస్తోంది. జూలై 13న ఎస్‌బిఐ క్యాప్స్ రూ. 1196 కోట్ల విలువైన ఎనిమిది ఆస్తులను వేలం వేస్తుందని, అలాగే హెచ్‌డిఎఫ్‌సి రియల్టీ జూలై 15న రూ.

మామిడి వ్యాపారుల సిండికేట్

చిత్తూరు, జూన్ 9: చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వస్తోంది. వ్యాపారులు రింగ్ అవుతూ రోజుకో ధర నిర్ణయించడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో మంచి ధరలు వస్తాయని ఆశించిన రైతులకు ఆశించినంత స్థాయిలో ధరలు దక్కక పోవడంతో నష్టాలకు గురికావాల్సి వస్తోంది. ప్రధానంగా మండీలలో వ్యాపారులు రింగ్ అవుతూ ధరలను నిర్ణయిస్తుండడంతో మామిడి రైతులు అయిన కాడికి కాయలు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా మామిడి పంటకు పెట్టింది పేరు.

పొగాకు పరిశ్రమలో విదేశీ పెట్టుబడులను పూర్తిగా నిషేధించాలి

న్యూఢిల్లీ, జూన్ 9: పొగాకు రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)పై సంపూర్ణ నిషేధం విధించాలని డిఐపిపి (పారిశ్రామిక విధాన, అభివృద్ధి విభాగం) చేసిన ప్రతిపాదన పట్ల నీతి ఆయోగ్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ మద్దతు తెలియజేయడంతో ఈ అంశంపై డిఐపిపి త్వరలో వాణిజ్య మంత్రిత్వ శాఖతో పాటు నీతి ఆయోగ్‌తో చర్చలు జరపాలని భావిస్తోందని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

Pages