తగ్గిన కార్ల అమ్మకాలు
Published Friday, 10 June 2016న్యూఢిల్లీ, జూన్ 9: దేశంలో గత నెల ప్యాసింజర్ కార్ల అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. గత ఏడాది మే నెలలో దేశ వ్యాప్తంగా 1,60,371 ప్యాసింజర్ కార్ల అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది మే నెలలో ఈ అమ్మకాలు 1,58,996 యూనిట్లకు తగ్గాయి. భారత ఆటోమొబైల్ ఉత్పత్తిదారుల సంఘం (సియామ్) గరువారం విడుదల చేసిన తజా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాల మందగమనం కొనసాగుతుండటం, సెడాన్ల కంటే ఇటీవల కొత్తగా మార్కెట్లోకి వచ్చిన యుటిలిటీ వాహనాల (యువిల) వైపు కొనుగోలుదారులు ఎక్కువగా మొగ్గు చూపుతుండటం ఇందుకు ప్రధాన కారణమని ‘సియామ్’ స్పష్టం చేసింది.