టీచర్ల గైర్హాజరుకు చెక్
Published Wednesday, 8 June 2016వరంగల్, జూన్ 7: రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనేక సంస్కరణలు చేపట్టబోతోంది. అందులో భాగంగా ముందుగా టీచర్లపై కొరడా ఝుళిపించనుంది. ఇప్పటికే ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ వృత్తితో పాటు అనేక వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, నెలవారి చిట్టీలతో పాటు ఇతర వృత్తుల్లో కూడా కొనసాగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ఉపాధ్యాయులు సకాలంలో పాఠశాలలకు రాకపోవడమే కాకుండా మరికొన్ని పాఠశాలల్లో వంతుల వారీ డ్యూటీలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అన్ని పాఠశాలల్లో బయో మెట్రిక్ విధానం ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఈ విద్యాసంవత్సరం నుండే ఈ విధానం అమలు చేయబోతున్నారు.