ఔత్సాహిక క్రీడాకారులకు కేంద్రం చేయూత
Published Wednesday, 8 June 2016హైదరాబాద్, బేగంపేట, జూన్ 7: ఔత్సాహిక క్రీడాకారులు, పర్వతారోహణ పట్ల ఆసక్తి కల్గిన యువతను అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని నెహ్రు యువ కేంద్ర సంఘటన్ వైస్ చైర్మన్ పేరాల చంద్రశేఖర్రావుతెలిపారు. హిమాలయ పర్వతాలలో 5226 మీటర్ల ఎత్తు కల్గిన వౌంట్నార్బు పర్వతాన్ని అధిరోహించి ఈ నెల 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను పర్వతంపై జాతీయ జెండా, తెలంగాణ పటం, తెలంగాణ జాగృతి జెండాను ఆవిష్కరించిన ఏడుగురు పర్వతారోహకులను ఆయన మంగళవారం సికిందరాబాద్లో జరిగిన కార్యక్రమంలో సన్మానించారు.