సహకార సంఘాలు బలోపేతం చేస్తా
Published Wednesday, 8 June 2016కరీంనగర్, జూన్ 7: ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో సహకార బ్యాంకులను బలోపేతం చేస్తున్నట్లు టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు తెలిపారు. మంగళవారం సాయంత్రం కెడిసిసి బ్యాంక్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక సహకార బ్యాంకుల్లో కంప్యూటరీకరణ చేసి, ఇటు రైతులకు, అటు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. గత ఏడాది ఖరీఫ్కు రూ.480 కోట్లు, రబీకి రూ.320 కోట్లు, ఎల్టికి రూ.50 కోట్లు, ఎస్హెచ్జి రూ.55 కోట్లు, బంగారు రుణాలు రూ.100 కోట్లు, ఇతర లోన్లు రూ.50 కోట్ల చొప్పున రుణాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.