అక్కడి వాళ్లదే రాజ్యం!
Published Sunday, 5 June 2016మధుర, జూన్ 4: ఉత్తరప్రదేశ్లోని మధురలో భూ ఆక్రమణలు, విధ్వంసక కార్యకలాపాలకు పాల్పడుతున్న స్వాధీన్ భారత్ సుభాష్ సేనకు సంబంధించి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. జవహర్బాగ్ ప్రాంతంలో ఓ ప్రభుత్వ పార్కులో తిష్టవేసిన సేన సొంతంగా ‘ఓ వ్యవస్థ’నే ఏర్పాటు చేసుకుని అరాచకాలకు పాల్పడుతోంది. ఇది ఎంతవరకూ వచ్చిందంటే సొంతంగా తీర్పులివ్వడం, వాటిని అమలు చేయడానికి యంత్రాంగం, ఎదురుతిరిగితే చిత్రహింసలకు గురిచేయడం జరుగుతోంది. ప్రభుత్వ భూమినుంచి ఖాళీ చేయించడానికి వెళ్లిన పోలీసులపై ఎదురుదాడికి దిగడమే కాకుండా ఓ ఎస్పీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్లతోపాటు 24 మందిని చంపేశారు.