సదావత్ సత్రం భూముల ఆక్రమాల నిగ్గు తేల్చాలి
Published Friday, 3 June 2016తిరుమల, జూన్ 2: సదావత్ సత్రంకు సంబంధించిన భూముల విక్రయాలలో అవకతవకలు జరిగాయని సత్రం పేరుతో ఉన్న వందలాది ఎకరాల భూములను అమ్ముకున్నారని భూము అక్రమాలను ప్రభుత్వం నిగ్గు తేల్చాలని విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి డిమాండ్ చేశారు. ఆయన గురువారం ఉదయం నైవేద్య విరామదర్శన సమయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయంలో తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటి ఇ ఒ కోదండరామారావు దర్శనం ఏర్పాటు చేసి తీర్థం ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన ఆలయం వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ గంగాతీరాన చాతుర్మాస దీక్ష చేయడం ఆనవాయితీ అన్నారు.