మిగిలింది ‘ఒక్కరే’
Published Friday, 3 June 2016హైదరాబాద్, జూన్ 2: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒకే ఒక్క పార్లమెంటు సభ్యుడు మల్లారెడ్డి టీఆర్ఎస్లోకి ఫిరాయించడంతో, ఇక ఆ పార్టీ ఉనికి కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మల్కాజిగిరి పార్లమెంటుసభ్యుడు మల్లారెడ్డి మహానాడు ముగిసిన రెండోరోజునే పార్టీ ఫిరాయించి టిడిపికి షాక్ ఇచ్చారు.చివరిరోజున పార్టీకి విరాళం ఇచ్చి, బాబుతో ఫొటో కూడా దిగిన మల్లారెడ్డి, హైదరాబాద్ వచ్చి టీఆర్ఎస్లో చేరటం పార్టీ నేతలు ఖంగుతినిపించింది. గతంలో ఇదేవిధంగా బాబు సమక్షంలో జరిగిన టిటిడిపి విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యేలు..