అమరవీరుల కుటుంబాలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే
Published Friday, 3 June 2016హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి అమరులైన కుటుంబాలను ఆదుకునే బాధ్యతను ప్రభుత్వం గుర్తించి వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించిందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పి.మహేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు.