నీటి సంరక్షణే దేశానికి రక్ష
Published Friday, 3 June 2016వాతావరణ మార్పులు దేశంలోని వివిధ ప్రాంతాలను వైపరీత్యాలతో వణికిస్తున్నాయి. తరచు అనావృష్టి, తుఫాన్లు, వరదలకు గురౌతున్నాయి. వాటి ఉధృతి మునుపటికన్నా ఎక్కువైంది. ఇటీవలి కాలంలోనే ఈ మూడురకాల వైపరీత్యాలు పెరగటం ఆందోళన కలిగించే అంశం. గతంలో దేశం చాలానే అనావృష్టులను చవిచూచింది. కాని 1998 తరువాత వాటి రాక ఎక్కువైంది. 1999, 2002, 2009, 2014, 2015 సంవత్సరాల్లో అనావృష్టుల చేదు రుచి చూడక తప్పలేదు. ఈ పరిణామం పేద రైతులను అత్యంత దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేసాయి. వీరికున్న కొంచెం వ్యవసాయ భూమిని తెగనమ్ముకొనేలా చేసి, జీవనోపాధికోసం నగరాలకు వలస కూలీలుగా తరిమేసాయి.