నేటి నుంచి ఆర్టీసిలో కార్గో
Published Friday, 3 June 2016నెల్లూరు, జూన్ 2: ఏపిఎస్ ఆర్టీసీ ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో భాగంగా సరకుల పార్శిల్ రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ రవీంద్రబాబు తెలిపారు. గురువారం నెల్లూరు ప్రధాన బస్టాండ్ ప్రాంగణంలో ఆయన నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ పార్శిల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రయాణికులతో పాటు సరకులను రవాణా చేసేందుకు నెల్లూరు జిల్లాలో 97 సర్వీసులను ప్రత్యేకంగా కేటాయించామన్నారు. ఈ సర్వీసుల్లోని లగేజి కేబిన్లను ఎవరికైనా కాలపరిమితి కాంట్రాక్టుగా కూడా ఇస్తామన్నారు. ఇతర పార్శిళ్లను కూడా చేరవేస్తామని తెలిపారు.